మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన మూవీ ఇది. వరుణ్ తేజ్ తొలిసారి అల్ట్రా స్టైలిష్ యాక్షన్ మూవీలో నటించడంతో మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ..నాజర్, విమలా రామన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.