స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) ఈ ఏడాది రెండు బ్లాక్ బాస్టర్లను అందుకుంది. జనవరిలో విడుదలైన చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో సక్సెస్ అందుకుంది. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి దుమ్ములేపాయి. ఈసారి హీరోయిన్లలో శృతిహాసన్ తోనే 2023లో బ్లాక్ బాస్టర్లు ప్రారంభమయ్యాయి.