ఈ చిత్రంలో చిరంజీవి, ప్రకాష్ రాజ్ తర్వాత అంతగా హైలైట్ అయిన పాత్ర విలన్ షాయాజీ షిండేది. తెలుగులో షాయాజీ షిండేకి ఇదే డెబ్యూ మూవీ. హిందీలో అల్లు అరవింద్ చూడాలని ఉంది చిత్రాన్ని కలకత్తా మెయిల్ అని రీమేక్ చేశారు. ఆ చిత్రంలో షాయాజీ షిండే నటించారు. ఠాగూర్ కోసం కొత్త విలన్ ని వెతుకుతున్న సమయంలో అల్లు అరవింద్.. చిరంజీవి, వినాయక్ కి షాయాజీ షిండే గురించి చెప్పారట. అలా షాయాజీ షిండే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.