ఇక లంచ్లో మిల్లెట్స్ తీసుకుంటారట. కచ్చితంగా మధ్యాహ్నం ఆయన చిరు ధాన్యలతో తయారు చేసిన ఫుడ్నే తీసుకుంటానని తెలిపారు. మిల్లెట్స్ తోపాటు కాయగూరలు, పెరుగు వంటివి లంచ్లో తీసుకుంటాడట. శరీరానికి, ఎనర్జీనిచ్చేవి ఏవి అవసరమో అవే తీసుకుంటానని చెప్పారు శరత్బాబు. ఇక సాయంత్రం సమయంలో ఫుల్కాల్లాంటివి, టిఫిన్ లాంటివి తీసుకుంటాడట. ఇక చాలా ఏళ్లుగా ఆయన రెండు ఐటెమ్స్ ని మాత్రం పక్కాగా మానేశారట. అందులో ఒకటి వైట్ రైట్. అది మానేసి చాలా ఏళ్లు అవుతుందన్నారు శరత్ బాబు. అందులో మనకు ఉపయోగపడే న్యూట్రిషన్ భాగం పై పొట్టు పశువులకు వేస్తున్నాం, పనికిరాని పిప్పి మనం తింటున్నామని, దాని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు శరత్బాబు. పనికి రానిది మానేస్తే మంచిదని తెలిపారు.