రష్మిక కొత్త కారుతో హల్‌చల్‌.. దాని విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

First Published Jan 7, 2021, 3:09 PM IST

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా కెరీర్‌ పరంగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. తెలుగు, తమిళం, కన్నడ, ఇప్పుడు హిందీ పరిశ్రమలో రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. తాజాగా ఈ విషయాన్ని పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది. మరి ఇంతకి దీని ఖరీదు తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. 
 

రష్మిక మందన్నా లగ్జరీ కారు రేంజ్‌ రోవర్‌ని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని చెబుతూ, ఫోటోని ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి అభిమానులు, వారి ప్రేమే కారణమని తెలిపింది.
undefined
ఈ సందర్భంగా పెద్ద పోస్ట్ పెట్టింది రష్మిక. `ఇలాంటి విషయాలను సాధారణంగా తనలోనే ఉంచుకుంటాను. కానీ ఈ సారి మాత్రం మీతో(ఫ్యాన్స్)తో పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రయాణంలో మీరు భాగమయ్యారు. కాబట్టి ఈ విషయం మీకు తెలియాలి` అని పేర్కొంది రష్మిక.
undefined
ఇంకా చెబుతూ, `కొన్ని రోజులు వెనక్కి వెళితే, నేను ఇంత వరకు(కారు కొనేంత స్థాయికి) వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఇప్పుడు సాధించాను. ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళాల్సి వచ్చిన ప్రతి సారి ఇలాంటి ఫోటోలు చూడాలి(టాక్సీ). ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నానో మీకు చూపించాలనుకున్నా.
undefined
ఈ ప్రయాణంలో భాగమైనందుకు, మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. కష్టతరమైన రోజులను విలువైనదిగా చేసుకోవడం వర్త్ అనిపించింది. ఇది నాకు నిజంగా సంతోషాన్నిస్తుంది. ఐ లవ్యూ. ఇది మీ కోసం` అని పేర్కొంది రష్మిక.
undefined
ఇదిలా ఉంటే దీని కాస్ట్ తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టక మానరు. ఎందుకంటే దీని ఖరీదు ఇండియాలో ప్రైజ్‌ ప్రకారం కోటి రూపాయలకుపైనే ఉంటుందని టాక్‌. బ్లాక్‌ కరల్‌ రేంజ్‌ రోవర్ 90లక్షల నుంచి కోటీ యాభై లక్షల వరకు లభిస్తాయి. రష్మిక తీసుకున్న కారు కోటికిపైనే ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం.
undefined
ఇదిలా ఉంటే టాలీవుడ్‌ హీరోయిన్లలో ఎవరికీ ఈ రేంజ్‌లో ఖరీదైన కారు లేదు. చాలా వరకు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఇన్నోవాలు, చిన్నపాటి బెంజ్‌ కారులు వాడుతుంటారు. అవి కూడా సినిమా యూనిట్‌లు సమకూరుస్తుంటాయి. లేదంటే పర్సనల్‌గా టాక్సీ వాడుతుంటారు. కానీ రష్మిక మాత్రం టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే రేంజ్‌రోవర్‌ స్థాయికి చేరుకోవడం నిజంగానే అభినందనీయం.
undefined
అయితే రష్మీక టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. `ఛలో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు `గీతగోవిందం`తో బ్లాక్‌బస్టర్‌ని అందుకుంది. `డియర్‌ కామ్రేడ్‌` పరాజయం చెందినా, `దేవదాస్‌` పర్వాలేదనిపించింది. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. దీంతో రెమ్యూనరేషన్‌ కూడా పెంచిందట. ఒక్కో సినిమాకి దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.
undefined
ప్రస్తుతం రష్మిక.. బన్నీతో కలిసి `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `ఆడాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తుంది. ఇటీవల హిందీలోనూ ఆఫర్స్ దక్కించుకుంది. `మిషన్‌ మజ్ను` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతోపాటు అమితాబ్‌తో మరో సినిమా చేస్తుందని టాక్‌. ఇలా క్రేజీ ప్రాజెక్ట్ తో పాపులారిటీతోపాటు రెమ్యూనరేషన్‌ కూడా పెంచుతూ ఆస్తులను వెనకేసుకునే పనిలో బిజీగా ఉందీ టాలెంటెడ్‌ బ్యూటీ.
undefined
click me!