రామ్ చరణ్ - కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శంకర్ ఈ చిత్రాన్ని ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే షూటింగ్ పార్టును పూర్తి చేసుకోనుంది. చిత్రంలో హీరోయిన్ అంజలి, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.