భర్తతో గొడవలు బయటపెట్టిన `ఢీ` భామ ప్రియమణి.. రెమ్యూనరేషన్‌ తగ్గించిందట!

Published : Jun 13, 2021, 10:00 AM ISTUpdated : Jun 13, 2021, 10:01 AM IST

`ఢీ` షోకి జడ్జ్ గా మరింత క్రేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రియమణి తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన భర్తతో జరిగే గొడవలు బయటపెట్టి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

PREV
17
భర్తతో గొడవలు బయటపెట్టిన `ఢీ` భామ ప్రియమణి.. రెమ్యూనరేషన్‌ తగ్గించిందట!
ప్రియమణి పెళ్లైన తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఇందులో సమంత, మనోజ్‌ భాజ్‌పాయ్‌ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
ప్రియమణి పెళ్లైన తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఇందులో సమంత, మనోజ్‌ భాజ్‌పాయ్‌ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
27
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి కెరీర్‌ గురించి, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించింది. ప్రియమణికి ముస్తఫా రాజ్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. మ్యారేజ్‌ తర్వాత కూడా సినిమాల్లో నటించడం విషయంలో భర్త ముస్తఫారాజ్‌ ప్రోత్సాహమే కారణమని తెలిపింది. ఆయన దొరకడం అదృష్టమని వెల్లడించింది. మ్యారేజ్‌ తర్వాతనే తనకు ఎక్కువ సినిమా ఆఫర్స్ వస్తున్నాయని పేర్కొంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి కెరీర్‌ గురించి, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించింది. ప్రియమణికి ముస్తఫా రాజ్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. మ్యారేజ్‌ తర్వాత కూడా సినిమాల్లో నటించడం విషయంలో భర్త ముస్తఫారాజ్‌ ప్రోత్సాహమే కారణమని తెలిపింది. ఆయన దొరకడం అదృష్టమని వెల్లడించింది. మ్యారేజ్‌ తర్వాతనే తనకు ఎక్కువ సినిమా ఆఫర్స్ వస్తున్నాయని పేర్కొంది.
37
అంతటితో ఆగలేదు, తమ మధ్య జరిగే గొడవలను కూడా బయటపెట్టింది ప్రియమణి. తమ మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయట. ఈ గొడవలు కామన్‌ అని తెలిపింది. గొడవల సమయంలో భర్తనే తగ్గుతాడని వెల్లడించింది. అంటే ప్రియమణినే కఠినంగా ఉంటుందని చెప్పకనే చెప్పింది.
అంతటితో ఆగలేదు, తమ మధ్య జరిగే గొడవలను కూడా బయటపెట్టింది ప్రియమణి. తమ మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయట. ఈ గొడవలు కామన్‌ అని తెలిపింది. గొడవల సమయంలో భర్తనే తగ్గుతాడని వెల్లడించింది. అంటే ప్రియమణినే కఠినంగా ఉంటుందని చెప్పకనే చెప్పింది.
47
బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌తో తమకి మంచి ఫ్యామిలీ రిలేషన్‌ ఉందని వెల్లడించింది. విద్యాబాలన్‌, తను కజిన్స్ అట. విద్యా బాలన్‌ నటన, ఆమె ఎంచుకునే పాత్రలు తనకు నచ్చుతుందని, ఆమెని చూసి గర్వంగా ఫీలవుతానని వెల్లడించింది. బాలీవుడ్‌లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలను దాటుకుని స్టార్‌ హీరోయిన్‌గా నిలబడటం గొప్ప విషయమని చెప్పింది. అలాగే సింగర్‌ మాల్గాడి శుభగారు తమ చిన్న మేనమామగారి భార్య అని వాళ్లమ్మ తరఫువాళ్లందరూ సంగీతం రంగంలో ఉన్నారని చెప్పింది ప్రియమణి.
బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌తో తమకి మంచి ఫ్యామిలీ రిలేషన్‌ ఉందని వెల్లడించింది. విద్యాబాలన్‌, తను కజిన్స్ అట. విద్యా బాలన్‌ నటన, ఆమె ఎంచుకునే పాత్రలు తనకు నచ్చుతుందని, ఆమెని చూసి గర్వంగా ఫీలవుతానని వెల్లడించింది. బాలీవుడ్‌లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలను దాటుకుని స్టార్‌ హీరోయిన్‌గా నిలబడటం గొప్ప విషయమని చెప్పింది. అలాగే సింగర్‌ మాల్గాడి శుభగారు తమ చిన్న మేనమామగారి భార్య అని వాళ్లమ్మ తరఫువాళ్లందరూ సంగీతం రంగంలో ఉన్నారని చెప్పింది ప్రియమణి.
57
సినిమా అవకాశాల విషయంలో మైండ్‌ సెట్‌ మారిందని చెప్పింది. పెళ్లైతే హీరోయిన్లకి అవకాశాలు రావు, బాడీ షేమింగ్‌పై అనేక కామెంట్స్ వస్తుంటాయి. కానీ తనపై అలాంటి విమర్శలు రాలేదని చెప్పింది. పైగా మ్యారేజ్‌ తర్వాతనే హీరోయిన్‌గా మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది. సమంత, కాజల్‌ కూడా మెయిన్‌ లీడ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

priyamani

67
కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి అదనపు భారం ఏర్పడుతుందని, అదే సమయంలో కొద్ది మందితోనే చిత్రీకరణ చేయాల్సి వస్తుందని చెప్పింది. అందుకే తాను కూడా కొంత పారితోషికం తగ్గించినట్టు పేర్కొంది.

priyamani

77
ప్రస్తుతం ప్రియమణి `ఢీ` షోకి జడ్జ్ గా చేయడంతోపాటు వెంకటేష్‌తో `నారప్ప` చిత్రంలో నటిస్తుంది. ఇందులో నటించడంపై `సినిమాకి మనం కలిసి పనిచేయాలని రాసి పెట్టి ఉందేమో` వెంకీ అనడం హ్యాపీగా అనిపించిందని చెప్పింది. ఈసినిమాతోపాటు `విరాటపర్వం`లో నక్సలైట్‌గా నటిస్తుంది ప్రియమణి. అలాగే హిందీలో `మైదాన్‌`లో, అలాగే `సైనైడ్‌`, `కొటేషన్‌ గ్యాంగ్‌` చిత్రాలు చేస్తుంది ప్రియమణి.
ప్రస్తుతం ప్రియమణి `ఢీ` షోకి జడ్జ్ గా చేయడంతోపాటు వెంకటేష్‌తో `నారప్ప` చిత్రంలో నటిస్తుంది. ఇందులో నటించడంపై `సినిమాకి మనం కలిసి పనిచేయాలని రాసి పెట్టి ఉందేమో` వెంకీ అనడం హ్యాపీగా అనిపించిందని చెప్పింది. ఈసినిమాతోపాటు `విరాటపర్వం`లో నక్సలైట్‌గా నటిస్తుంది ప్రియమణి. అలాగే హిందీలో `మైదాన్‌`లో, అలాగే `సైనైడ్‌`, `కొటేషన్‌ గ్యాంగ్‌` చిత్రాలు చేస్తుంది ప్రియమణి.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories