తన ఫ్యామిలీతో కలిసి దివాళి సెలబ్రేట్ చేసుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ముంబయికి చెందిన ఈ భామ, ఉత్తరాధి సాంప్రదాయం ప్రకారం ముస్తాబై తన ఇంట్లోదీపాలు వెలిగించింది.
undefined
కాంతులీనేలా దీపాలు వెలిగించి తన ఆనందాన్ని పంచుకుంది. అనంతరం తన తల్లిదండ్రులు సోదరుడితో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
ఈ సందర్భంగా పూజా హెగ్డే స్పందిస్తూ, తన అభిమానులు, ప్రజలకు దివాళి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రేమ, కాంతి, పాజిటివిటీ, సంతోషంతో మీ జీవితాలు వెలిగిపోవాలని,కాంతితో ప్రతి ఒక్కరి ఇళ్లు ప్రకాశించాలని పేర్కొంది.
undefined
ఎల్లో డ్రెస్లో దీపావళికి యాప్ట్ అనిపించే డ్రెస్లో పూజా ముస్తాబై ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం పూజా ఫోటోలు హల్ చల్ చేస్తుంది.
undefined
`ఒకలైలా కోసం`, `ముకుందా` చిత్రాలతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, `డీజే` సినిమాతో టాలీవుడ్లో పాతుకుపోయింది.
undefined
వరుసగా `సాక్ష్యం`, `అరవింద సమేత`, `మహర్షి`, `గద్దలకొండ గణేష్`, `అల వైకుంఠపురములో` చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన `అలవైకుంఠపురములో` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. దీంతో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
undefined
ఇటీవల టాలీవుడ్పై, సౌత్పై పలు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది పూజా. సోషల్ మీడియా వేదికగా ఆమెని నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకున్నారు. దీంతో దిగొచ్చింది.తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది.
undefined
ప్రస్తుతం పూజా ప్రభాస్తో కలిసి `రాధేశ్యామ్`లో హీరోయిన్గా నటిస్తుంది. దీంతోపాటు అఖిల్తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` చిత్రంలో నటిస్తుంది.
undefined