కీర్తిసురేష్.. `మహానటి` చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
undefined
ఇటీవల `మిస్ ఇండియా` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై పరాజయం చెందింది. కీర్తి నటన పరంగా మెప్పించినా.. సినిమాలో కంటెంట్ బలంగాలేకపోవడంతో నిరాశ పరిచింది.
undefined
ఇక ఇప్పుడు దీపావళి సందర్బంగా సందడి చేసింది కీర్తిసురేష్. మొదట రెండు మూడీగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పచ్చిన గడ్డిపై పడుకునిబుంగమూతి పెట్టి కనిపించింది. అలిగినట్టు అర్థమవుతుంది.
undefined
మరోవైపు కీర్తికి టపాసులు అంటే చాలా భయం. తాను టపాసులు కాల్చేందుకు భయపడుతున్న వీడియో సైతం వైరల్ అవుతుంది. బహుశా ఈ భయమే కీర్తి బుంగమూతిపెట్టడానికి కారణమని అర్థమవుతుంది. అయితే రాత్రి సమయంలో ఫ్యామిలీతో కలిసి తుపాకి రూపంలో ఉన్న కాకపుల్లలను అంటించగా, అది మెరుస్తూ మంట వస్తుంది.
undefined
దీంతోపాటు దీపావళి సందర్భంగా అందంగా ముస్తాబైంది. దివాళి అంటే కచ్చింతంగా సరికొత్తగా రెడీ కావాల్సిందే. లైట్ గ్రీన్ కలర్ టాప్, ఎల్లో చున్నీ ధరించి పెద్దగా మేకప్ లేకుండానే ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
వీటిని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన అభిమానులను అలరిస్తున్నాయి. వాటికి లైక్ ల మీద లైక్లు కొడుతున్నాయి.మరికొందరు క్యూట్, బ్యూటీఫుల్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
undefined
దీంతోపాటు తాను నటిస్తున్న `సాని కాయిదమ్` చిత్ర పోస్టర్ పంచుకుంది కీర్తి. ఇందులో డీ గ్లామర్ లుక్లో కనిపిస్తుంది. సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కీర్తి దొంగగా, బంధిపోటు తరహా పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం విశేషం.
undefined