`కేజీఎఫ్` తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించింది `కాంతార`(Kantara) మూవీ. చాలా తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.450కోట్లు వసూలు చేసింది. కన్నడలో విడుదలైన పది రోజులకు ఇతర భాషల్లో రిలీజ్ అయి ఈ అరుదైన రికార్డుని క్రియేట్ చేయడం విశేషం. దర్శకుడు రిషబ్ శెట్టి(Rishab Shetty) దర్శకత్వం వహిస్తూ, ఇందులో హీరోగా నటించారు. శివ పాత్రలో అదరగొట్టారు. ఆయనకు జోడీగా సప్తమి గౌడ మెప్పించింది. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారట. దర్శకుడు సీక్వెల్ని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇదే ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. అయితే ఇది `కాంతార`కి సీక్వెల్(Kantara Sequel) కాదని, ప్రీక్వెల్గా(Kantara Prequel) తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకి ముందు ఏం జరిగిందనేది రెండో భాగంలో చూపించబోతున్నారట దర్శకుడు రిషబ్ శెట్టి భారీ బడ్జెట్తో దీన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం Kantara 2 స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేందుకు కోస్తా కర్నాటకలో పరిశోధన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి జూన్లో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాదు వచ్చే ఏడాది, అంటే 2024 సమ్మర్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. భారీ స్థాయిలో నిర్మించేందుకు హోంబలే ఫిల్మ్స్ సన్నాహాలు చేస్తుందని టాక్. ఈ వార్త కన్ఫమ్ అని కన్నడ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.
ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రైవేజ్ వేలో ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ కి షార్ట్ లిస్ట్ అయ్యింది. మన ఇండియాకి చెందిన జ్యూరీ దీన్ని ఎంపిక చేయలేదు. కానీ మరో దారిలో ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్తుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగంలో `కాంతార` ఆస్కార్ నామినేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యింది. ఈ నెల 25తో ఆస్కార్కి నామినేట్ అవుతుందా? లేదా అనేది తేలనుంచి.
`కాంతార` దక్షిణ కన్నడకి చెంది భూత కోలా సాంప్రదాయ పండుగ నేపథ్యంలో సాగుతుంది. అడవి ప్రజల పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. అంతేకాదు అంతర్లీనంగా భూస్వాములు, పేదలు, అణగారిన వర్గాలపై దోపిడిని, అసమానతలను చర్చించిన చిత్రమిది. పెద్దవాళ్లు అడవి జనాలను ఎలా వాడుకుంటారో, ఎంతగా తక్కువగా చూస్తారనే విషయాన్ని ఇందులో దర్శకుడు రిషబ్ శెట్టి కళ్లకు కట్టినట్టు చూపించారు. దీనికితోడు దైవత్వం ఈ సినిమా సక్సెస్లో పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు.