ఆసుపత్రి బెడ్ పై ఆహారం తీసుకోలేని స్థితిలో ఇలియానా.. ఏం జరిగింది..

First Published Jan 30, 2023, 6:32 PM IST

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది.

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

అయితే ప్రస్తుతం ఈ నడుము సుందరి అరకొర చిత్రాలు చేస్తూ.. ఫ్రెండ్స్ తో ఫారెన్ ట్రిప్పులో బిజీగా ఉంటోంది. ఫారెన్ వెకేషన్స్ లో హుషారుగా ఉండే ఇలియానా తాజాగా అస్వస్థతకి గురైంది. తాను ఆసుపత్రి పాలైన విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

ఇలియానా అనారోగ్యానికి గల కారణాలు చెప్పలేదు కానీ.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకి మూడు సెలైన్ బాటిల్స్ ఎక్కించారట. ఇంతలా ఇలియానా అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. 

బహుశా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. వైద్యులు ఇచ్చిన ట్రీట్మెంట్ తో తాను ప్రస్తుతం కోలుకున్నానని ఇలియానా మరో పోస్ట్ లో పేర్కొంది. అంతా ఒక్కరోజులో జరిగిపోయిందని ఇలియానా పేర్కొంది. 

తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఏది ఏమైనా ఇలియానా ఆసుపత్రి పాల కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.  గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది.

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

click me!