ఇండస్ట్రీలో నాకు శత్రువులు ఉన్నారు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్.!

First Published Aug 26, 2022, 2:38 PM IST

కన్నడ బ్యూటీ నిత్యా మీనన్ (Nithya Menen) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఈ హీరోయిన్ తనకు ఇండస్ట్రీలో చాలా మంది శత్రువులు ఉన్నారంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 
 

సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ నిత్యామీనన్ (Nithya menen). ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న హీరోయిన్ ఈమె. నిత్యామీనన్ చేసే సినిమాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఇటీవల ఈ బ్యూటీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తలో నిలుస్తోంది. 
 

ఇటీవల తనను పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి వేధించాడని నిత్యామీనన్  చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ మ్యాటర్ సద్దుముణుగుతుండగా.. తాజాగా మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తనకు శత్రువులు ఉన్నారంటూ నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

నిత్యామీనన్ చేసింది తక్కువ చిత్రాలే అయినా  సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ బ్యూటీకి విశేష ఆదరణ పొందింది. స్టార్ హీరోయిన్ కాకపోయినా ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. వరుసగా ఆయా భాషా చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోందీ బ్యూటీ.
 

తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘తిరుచిత్రంబలం’ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈక్రమంలో నిత్యా మీనన్ పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. 
 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.నిత్యా మీనన్ మాట్లాడుతూ.. ఇటీవల తనపై వస్తున్న రూమర్లను ఖండించింది. తనకు ఇండస్ట్రీలో చాలా మంది శత్రువులు ఉన్నారని తెలిపింది. మన ఎదుగదలను ఓర్చుకోలేని వారు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. వారి మాట వినకపోతే.. వదంతులను ప్రచారం చేస్తారు. 
 

తనతో పనిచేయడం కష్టమని అంటున్నారు.. కానీ ఇప్పటికే తను చాలా మంది స్టార్స్, దర్శకులతో కలిసి పనిచేసిందని చెప్పుకొచ్చింది. ఎక్కడా ఎలాంటి అభ్యతంరం వ్యక్తం కాలేదన్నారు. నిత్యామీనన్ ఎలాంటిదో తనతో పనిచేసిన వారికి బాగా తెలుసని బదులిచ్చింది. నిత్య ప్రస్తుతం మలయాళంలో రూపుదిద్దుకుంటున్న మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. 
 

click me!