చీకట్లో చిరంజీవికి చీర చెంగు ఇచ్చిన హీరోయిన్, సడన్ గా లైట్స్ వేయడంతో బట్టబయలు!

First Published Apr 16, 2024, 2:11 PM IST


చిరంజీవికి ఒక హీరోయిన్ చీకట్లో చీర చెంగు ఇచ్చిందట. ఆ చీర కొంగు పట్టుకుని కన్నీళ్లు తుడుచుకుండగా ఒక్కసారిగా లైట్స్ పడ్డాయట. ఈ పరిణామం జరిగినప్పుడు సురేఖ కూడా ఉందట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం.. 
 

చిరంజీవి సెల్ఫ్ మేడ్ స్టార్. హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొక్కవోని పట్టుదలతో స్టార్ హీరో అయ్యాడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృషితో నెంబర్ వన్ హీరో స్థానం సొంతం చేసుకున్నాడు. 
 

Chiranjeevi

చిరంజీవి సినీ ప్రస్థానంలో అనేక మైలురాళ్ళు ఉన్నాయి. ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ఇంటర్వ్యూలలో చిరంజీవి తన ప్రయాణంలో గల ఆసక్తికర సంఘటనలు గుర్తు చేసుకున్నారు. చిరంజీవి బాగా ఏడ్చిన సినిమా శంకరాభరణం అట. ఆ చిత్ర క్లైమాక్స్ లో చిరంజీవికి కన్నీళ్లు ఆగలేదట. 

శంకరాభరణం మూవీలో హీరోయిన్ గా నటించిన మంజు భార్గవి చిరంజీవిని ఆ చిత్ర ప్రీమియర్ షోకి ఆహ్వానించిందట. వీరిద్దరూ కోతల రాయుడు మూవీలో కలిసి నటించిన నేపథ్యంలో ఆ పరిచయంతో చిరంజీవిని మంజు భార్గవి రమ్మన్నారట. ఆమె ఆహ్వానం మేరకు చిరంజీవి వెళ్లారట. 

అప్పటికి చిరంజీవి చిన్న హీరో. ఆయనకు దర్శకుడు కే విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో పరిచయం లేదట. మంజు భార్గవి పక్కనే కూర్చున్న చిరంజీవి శంకరాభరణం క్లైమాక్స్ చూసి బాగా ఎమోషనల్ అయ్యాడట. కంటి నుండి నీరు ధారగా కారిపోతున్నాయట. 

ఎంత కంట్రోల్ చేసినా కన్నీళ్లు లేదట. ఇది గమనించిన మంచు భార్గవి తన చీర కొంగు చిరంజీవికి ఇచ్చిందట. ఆమె కొంగు తీసుకుని చిరంజీవి కళ్ళు తుడుచుకుంటుండగా లైట్స్ వేశారట. మంజు భార్గవి చీర కొంగు చిరంజీవి చేతిలో ఉండటం అందరూ చూశారట. 

శంకరాభరణం ప్రీమియర్ షోకి అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా వచ్చింది. బహుశా సురేఖ కూడా చూసి ఉండొచ్చు. అప్పటికి మాకు ఇంకా పెళ్లి కాలేదని... చిరంజీవి అన్నారు. సమంత గతంలో ఆహా లో సామ్ జామ్ టైటిల్ తో ఒక టాక్ షో చేసింది. అప్పుడు చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించాడు. 

click me!