ఎరుపు దుస్తుల్లో హేబా గ్లామర్ మెరుపులు.. హాట్ నెస్ తో మత్తెక్కిస్తున్న కుమారి పోజులు.!

First Published Oct 17, 2022, 4:57 PM IST

యంగ్ బ్యూటీ హేబా పటేల్ (Hebah Patel) నెట్టింట మాత్రం క్రమం తప్పకుండా అందాల విందుచేస్తోంది. ఇందుకోసం అదిరిపోయే దుస్తుల్లో మతి చెడగొట్టేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

మళ్లీ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాల కోసం తెగ ఆరాట పడుతోంది యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ హేబా పటేల్. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూనే కొత్త ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 

రీసెంట్ గా ‘ఓదెల రైల్వే స్టేషన్’తో ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిందీ బ్యూటీ. పల్లెటూరి వివాహితగా చాలా సహజంగా నటించి ఆడియెన్స్ మెప్పు పొందింది. చాలా రోజులత  ఈ చిత్రంతో అభిమానులు, ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 

అయితే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాలేదు. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలై మంచి వ్యూయర్ షిప్ ను దక్కించుకుంది. కాగా, హేబా పటేల్ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘కుమారి 21ఎఫ్’తో దక్కించుకున్న క్రేజ్ తోనే నెట్టుకొస్తోంది. 
 

ఈ క్రమంలో మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇంటర్నెట్ ఫ్యాన్స్, అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఈ సందర్భంగా సినీ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటోంది. 
 

అదేవిధంగా అదిరిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ట్రెండీ వేర్ లో గ్లామర్ మెరుపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. హాట్ నెస్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కవ్వించేలా ఫొటోలకు పోజులిచ్చి మతి పోగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
 

హేబా పటేల్ తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ నటించిన ‘శాసన సభ’, ‘తెలిసినవాళ్లు’, ‘గీత’ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. అలాగే తమమిళంలోనూ ‘వల్లన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లోనే రూపుదిద్దుకుంటున్న ‘ఆద్య’లో నటిస్తోంది.

click me!