బ్లాక్ టాప్, టోర్న్ జీన్స్ సూపర్ స్టైలిష్ గా... ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కిన అనుష్క శెట్టి!

First Published Jan 12, 2021, 9:34 PM IST

స్వీటీ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోలోగా స్టార్ హీరో రేంజ్ వసూళ్లు సాధించగలడు. అరుంధతీ మూవీ వసూళ్లు దానికి నిదర్శనం. ఆ మూవీ తరువాత అనుష్క ఇమేజ్ పూర్తిగా మారిపోగా అనేక భారీ చిత్రాల్లో నటించారు. 
 

ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించిన బాహుబలి సిరీస్ లో మెయిన్ హీరోయిన్ గా అనుష్క నటించిన విషయం తెలిసిందే. అంతకు ముందే దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి వంటి భారీ బడ్జెట్ మూవీలో అనుష్క ప్రధాన పాత్ర చేయడం జరిగింది.
undefined
బాహుబలి సినిమా తరువాత అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. బాహుబలి 2 , 2017లో విడుదల కాగా... 2018లో భాగమతి మూవీ చేసి హిట్ అందుకున్నారు.
undefined
క్యామియో రోల్స్ మినహాయిస్తే భాగమతి తరువాత అనుష్క నటించింది నిశ్శబ్దం మాత్రమే. ఇటీవల ఓ టి టి లో విడుదలైన నిశ్శబ్దం అనుకున్నంత విజయం సాధించలేదు.
undefined
ఆ మూవీ తరువాత మరో సినిమాకు అనుష్క సైన్ చేయలేదు. ఆమె అభిమానులు మాత్రం అనుష్క వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఆమె ప్రాజెక్ట్ ఒకే చేస్తే కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నా కానీ అనుష్క కొత్త చిత్రాల ప్రకటన చేయడం లేదు.
undefined
ఓ తమిళ దర్శకుడు అనుష్కతో భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన జరగలేదు.
undefined
కాగా చాలా కాలం తరువాత అనుష్క మీడియా కంటపడ్డారు. అనుష్క హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ తమ కెమెరాలకు పనిచెప్పారు.
undefined
ఆమె సినిమాలకు లేక ఇబ్బందిపడుతున్న ఫ్యాన్స్ కి అనుష్క కనిపించి కనువిందు చేశారు. అలాగే అనుష్క హైదరాబాద్ రావడం వెనుక కారణం కొత్త సినిమా ప్రకటన కోసమే అంటున్నారు.
undefined
click me!