గత ఆరు సీజన్లో ఎన్నడూ లేని విధంగా కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో మొదలైంది. సాధారణంగా 19 నుండి 21 మంది కంటెస్టెంట్స్ తో షో లాంచ్ చేస్తారు. సీజన్ 7లో వివిధ కారణాలతో అతి తక్కువ మంది హౌస్లోకి వెళ్లారు. వీరిలో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్ నాలుగు వారాల్లో ఇంటిని వీడారు. రతికా ఎలిమినేషన్ అనంతరం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, శివాజీ, సందీప్, ప్రియాంక ఉంటారు.