3 రోజుల్లో భారీ నష్టాలను చవిచూసిన ఇన్వెస్టర్లు
ఈ వారంలోని మొదటి రోజున సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలలో కొనసాగుతు సెన్సెక్స్ 61,385 స్థాయికి చేరుకుంది. అప్పుడు బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం విలువ రూ.2,80,02,438 కోట్లు. ఆ తర్వాత షేర్ మార్కెట్లో డౌన్ట్రెండ్ మొదలై బుధవారం ఈ విలువ రూ.2,74,85,912 కోట్లకు దిగజారగా, దీంతో ఇన్వెస్టర్లు రూ.5.15 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూశారు. అలాగే నేడు భారీ పతనం తరువాత ఈ లోటు మరింత పెరిగింది.