వాట్సాప్ కాల్స్ తో జాగ్రత్త
నేరస్థులు వాట్సాప్లో ప్రజలకు వీడియో కాల్స్ చేసి, డిజిటల్గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నారని ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ అరెస్ట్ వంటి నేరాల వల్ల ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోవడమే కాకుండా కొందరు భయంతో ప్రాణాలు కూడా కోల్పోయారని అందుకే ఈ ప్రకటన జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది.