రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భారత దేశంలో అత్యంత ధనవంతుడు. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఎప్పుడూ టాప్ 10 లో ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో. టెలికాం, పెట్రో ప్రోడక్ట్, ఎలక్ట్రానిక్స్, సూపర్ మార్కెట్స్, క్లాత్స్ ఇలా రిలయన్స్ అన్ని రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తోంది.
ప్రస్తుతం 8,49,926 కోట్ల రూపాయల ఆస్తులతో ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఆయన నడిపిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 17,27,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్తో భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా రికార్డుల్లో ఉంది.