దేశవ్యాప్తంగా నడిచే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పండుగలు, సెలవుల సమయంలో అదనపు రైళ్లు నడుపుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
దేశంలో చాలా ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ కోచ్లను తగ్గించి, ఎయిర్ కండిషన్డ్ కోచ్లను పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిజర్వేషన్ లేని కోచ్లు తక్కువగా ఉండటం వల్లే స్లీపర్ కోచ్లలో ప్రయాణికులు ఎక్కుతున్నారని, రిజర్వేషన్ లేని కోచ్లను పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.