ఈ కొత్త స్కూటర్ 2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్లో ఇది రిస్టాను పోలి ఉంటుంది. LED హెడ్ల్యాంప్, సింపుల్ బాడీ ప్యానెల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఒకే ఛార్జ్పై సుమారు 150 కి.మీ రేంజ్ ఇవ్వొచ్చని అంచనా.
ఏథర్ ఎనర్జీ కంపెనీని 2013లో బెంగళూరులో ప్రారంభమైంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే కంపెనీ. పర్యావరణానికి మేలు చేసేలా పెట్రోల్ అవసరం లేకుండా స్కూటర్లు తయారు చేస్తుంది. అంతేకాదు బైక్ కు టచ్ స్క్రీన్ డిస్ ప్లే, మ్యాప్స్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, వేగంగా బ్యాటరీ ఛార్జ్ కావడం వంటి సదుపాయాలతో వచ్చింది. అందుకే ఇది ఎంతో మంది ఫేవరేట్ గా మారింది. దీన్ని ఇంట్లో కూడా ప్లగ్ పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు.