Air India Fine:ఎయిర్ ఇండియాకి భారీ జరిమానా, డి‌జి‌సి‌ఏ ఎందుకు చర్య తీసుకుందంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Jun 14, 2022, 05:56 PM IST

ఎయిర్ ఇండియాపై చర్యలు తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ ఏవియేషన్, డిజిసిఎ.. రూ.10 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికలో వాలిడిటీ  టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు బోర్డింగ్ నిరాకరించినందుకు ఎయిర్ ఇండియాపై DGCA ఈ జరిమానా విధించింది.   

PREV
14
Air India Fine:ఎయిర్ ఇండియాకి భారీ జరిమానా, డి‌జి‌సి‌ఏ ఎందుకు చర్య తీసుకుందంటే..?

వాలిడిటీ  టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు బోర్డింగ్ నిరాకరించినందుకు అలాగే  ప్రయాణికులకు తప్పనిసరి పరిహారం చెల్లించనందుకు ఎయిర్ ఇండియాపై రూ. 10 లక్షల జరిమానా విధించినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA మంగళవారం తెలిపింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది అలాగే వ్యక్తిగత విచారణ కూడా నిర్వహించింది.
 

24

DGCA దీనిని తీవ్రమైన అలాగే ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంటూ ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే వ్యవస్థలను ఏర్పాటు చేయాలని విమానయాన సంస్థకు సూచించింది, లేని పక్షంలో DGCA తదుపరి కఠిన చర్యలు తీసుకుంటుంది. వాలిడిటీ  టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణీకుడికి బోర్డింగ్ నిరాకరించి, సమయానికి విమానాశ్రయంలో రిపోర్ట్ చేసినట్లయితే, సంబంధిత విమానయాన సంస్థ DGCA ప్రకారం కొన్ని నిబంధనలను అనుసరించాలి. 
 

34

డైరెక్టరేట్ ఆఫ్ ఏవియేషన్ తరపున నిబంధనలను ఉటంకిస్తూ, సంబంధిత విమానయాన సంస్థ బాధిత ప్రయాణీకుడి కోసం ఒక గంటలోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయగలిగితే, అప్పుడు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు, వచ్చే 24 గంటల్లో ఎయిర్‌లైన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలిగితే రూ. 10,000 వరకు పరిహారం చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. 24 గంటలకు మించితే రూ.20 వేల వరకు పరిహారం ఇవ్వాలని నిర్దేశించారు. 

44

DGCA మంగళవారం ఈ విషయంపై మా నిబంధనలు US ఏవియేషన్ రెగ్యులేటర్ FAA అండ్ యూరోపియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ EASAకి అనుగుణంగా ఉన్నాయని ఇంకా ప్రయాణీకుల హక్కులకు తగిన గౌరవం ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నియమాలను అనుసరిస్తున్నాయని DGCA తెలిపింది. పైన పేర్కొన్న నియమాన్ని  అనుసరించాలని ఇటీవల DGCA అన్ని దేశీయ విమానయాన సంస్థలకు కఠినమైన సూచనలను జారీ చేసింది. DGCA, మే 2న ఒక ఇ-మెయిల్‌లో బోర్డింగ్ తిరస్కరణ వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు నష్టపరిహారం ఇంకా సౌకర్యాలను అందించాలని అన్ని భారతీయ క్యారియర్‌లను కోరింది ఇంకా అలా చేయడంలో విఫలమైతే  ఆర్థిక జరిమానాకు గురవుతారని ఆదేశించింది.

click me!

Recommended Stories