కరోనాకి మరో రచయిత బలి.. రైటర్‌ వంశీ రాజేష్‌ కన్నుమూత

Published : Nov 12, 2020, 11:13 PM IST
కరోనాకి మరో రచయిత బలి.. రైటర్‌ వంశీ రాజేష్‌ కన్నుమూత

సారాంశం

కరోనా మహమ్మారి అనేక మంది ప్రముఖులను బలితీకుంటుంది. ఇప్పుడు మరో రైటర్‌ని కరోనా బలితీసుకుంది. తెలుగులో ప్రముఖ రచయితగా రాణిస్తున్న యువ కథా రచయిత వంశీ రాజేష్‌ కరోనాతో గురువారం కన్నుమూశారు. 

కరోనా మహమ్మారి అనేక మంది ప్రముఖులను బలితీకుంటుంది. ఆ మధ్య గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కన్నుమూశారు. ఇటీవల రచయిత, వరుణ్‌ సందేశ్‌ తాత జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూశారు. ఇప్పుడు మరో రైటర్‌ని కరోనా బలితీసుకుంది. తెలుగులో ప్రముఖ రచయితగా రాణిస్తున్న యువ కథా రచయిత వంశీ రాజేష్‌ కరోనాతో గురువారం కన్నుమూశారు. 

ఆయన గత కొంత కాలంగా కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమని విషాదంలో నింపారు. వంశీ రాజేష్‌ ఆకస్మిక మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. 

వంశీ రాజేష్‌.. శ్రీనువైట్ల దర్శకత్వంలో, రవితేజ నటించిన `అమర్‌ అక్బర్‌ ఆంటోని` సినిమాకు రైటర్‌గా పనిచేశారు. దీంతోపాటు శ్రీనువైట్ల, గోపీమోహన్‌ కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలకు వర్క్ చేశారు. వీటిలో `మిస్టర్‌` కూడా ఉంది. ఇందులో రచనా సహకారం అందించారు. ఆయన చివరిగా `శబ్దం` సినిమాకు పనిచేశారు. ఇది రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. వంశీ మరణంతో దర్శకుడు శ్రీనువైట్ల స్పందిస్తూ, ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్‌ మరణ వార్త విని షాక్‌కి గురైనట్టు తెలిపారు. చాలా బాధగా ఉందని, తన జీవితంలో మరిచిపోలేని వ్యక్తి అని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ, వంశీ ఆత్మకి శాంతి చేకూరాలని పేర్కొన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు