మరో ఆఫర్ దక్కించుకున్న వేణు తొట్టెంపూడి! మళ్లీ ఆ దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం..

By team teluguFirst Published Aug 8, 2022, 12:24 PM IST
Highlights

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రామా రావు  ఆన్ డ్యూటీ’ చిత్రంతో నటుడు వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫ్యామిలీ హీరో మరో ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 
 

పదేండ్ల తర్వాత టాలీవుడ్ ఫ్యామిలీ హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) సినిమాలకు కమ్ బ్యాక్ ఇచ్చారు. రీసెంట్ విడుదలైన మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) చిత్రం ‘రామరావు ఆన్ డ్యూటీ’తో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన అభిమానులను ఆకట్టుకున్నాడు. జూలై 29న ఈ చిత్రం  థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ వేణు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడంతో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో వేణుకు కొత్త ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలో వేణు నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వేణు హీరోగా నటించిన ‘స్వయంవరం’ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అప్పటి నుంచే వేణు సినీ ప్రయాణం ప్రారంభమైంది. త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ‘ఎస్ఎస్ఎంబీ28’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గతేడాదే అనౌన్స్ చేసిన  ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇటీవలనే మహేశ్ బాబు తన ఫ్యామిలీతో వేకేషన్ పూర్తి చేసుకొని హైదరబాద్ కు చేరాడు. ఇక  త్రివిక్రమ్ తో కలిసి తన 28వ చిత్రాన్ని ప్రారంభించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో స్టార్ కాస్ట్ పైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ అందుతుండగా.. వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు సరసన  గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే ఆడిపాడనుంది.

వేణు తన బిజినెస్ లపై ఫోకస్ పెట్టడం మూలంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే అన్నీ సెట్ అయ్యాక మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు కరోనా సమయం నుంచే ప్రయత్నించాడు. రవితేజ చిత్రానికంటే ముందే వేణు ప్రధాన పాత్రలో ఫన్ బకెట్ వారి నిర్మాణంలో ఓ సినిమా ఒకే అయ్యిందని, మరో బ్యానర్ లోనూ ఇంకో సినిమా ఒకే అయ్యిందని వేణు తెలిపారు. కానీ  రవితేజ సినిమా కావడంతో ఒకే చెప్పారన్నారు. మున్ముందు వేణు లీడ్ రోల్ సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. 

click me!