బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసింది. కంటెస్టెంట్స్ గా 14 మంది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా చివర్లో హోస్ట్ నాగార్జున జీరో రెమ్యూనరేషన్ అంటూ షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ డే 2 కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి..

06:37 PM (IST) Sep 02
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ఒకరిని మించి మరొకరు ఉన్నారు. మొదటి రోజే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. ఎవ్వరూ తగ్గడం లేదు.
03:34 PM (IST) Sep 02
బిగ్ బాస్ హౌస్లో అప్పుడే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. మణికంఠ నటుడు ఆదిత్య ఓం పై అసహనం వ్యక్తం చేశాడు. ఫుడ్ విషయంలో శేఖర్ బాషా లేడీ కంటెస్టెంట్ తో వాగ్వాదానికి దిగాడు. ఫస్ట్ టాస్క్ లో అమ్మాయిలు అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రోమో ఆసక్తి రేపుతోంది.
11:15 AM (IST) Sep 02
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు హౌస్లో ఓ కంటెస్టెంట్ ఐ లవ్ యూ చెప్పడం సంచలనమైంది..
బెజవాడ బేబక్కకు బాత్ రూమ్ లో ఐ లవ్ యూ చెప్పిన కంటెస్టెంట్, ఆమె రియాక్షన్ ఏమిటో తెలుసా?
06:45 AM (IST) Sep 02
బిగ్ బాస్ విన్నర్స్ కి సాధారణంగా రూ. 50 లక్షలు ప్రైమ్ మనీగా ఇస్తారు. ఫినాలేలో హోస్ట్ నాగార్జున కొందరు కంటెస్టెంట్స్ కి కొంత మనీ ఆఫర్ చేసి రేసు నుండి తప్పుకోవచ్చని సలహా ఇస్తాడు. సీజన్ 7లో ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. మిగిలిన రూ. 35 లక్షలు విన్నర్ పల్లవి ప్రశాంత్ కి ఇచ్చారు.
ఈసారి విన్నర్ కి జీరో రెమ్యూనరేషన్ అంటున్నాడు నాగార్జున. అంటే విన్నర్ కి రూపాయి కూడా ప్రైమ్ మనీ రూపంలో దక్కదా... అంటే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ప్రైజ్ మనీ కూడా లిమిట్ లెస్. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా అది పెరుగుతూ పోతుంది. మిస్టేక్స్ చేస్తే తగ్గుతుంది. 15వ వారానికి ప్రైజ్ మనీ ఎన్ని లక్షలకు చేరుకుంటుందో అది విన్నర్ కి దక్కుతుంది. అది రూ. 50 లక్షల కంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు.
బిగ్ బాస్ 8 విన్నర్ రెమ్యూనరేషన్ జీరోతో మొదలు, ఎండ్ ఎక్కడంటే? రూ. 50 లక్షలు కాదు!