'సైరా' టీమ్ ధీమా.. అసలు పర్మిషన్లు వస్తాయా..?

By AN TeluguFirst Published Oct 1, 2019, 4:40 PM IST
Highlights

ఆంధ్రలో అదనపు ఆటలు వేయడానికి సైరా సినిమాకు ఇప్పటి వరకు పర్మిషన్ రాలేదు. వస్తుందా? రాదా? అన్నది తెలియదు. 
 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఏపీలో ఈ సినిమా అదనపు ఆటలు వేయడానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి పర్మిషన్లు రాలేదు. అసలు పర్మిషన్ వస్తుందా..? రాదా..? అనేది కూడా అర్ధంకాని పరిస్థితి. 

కానీ రేపు ఉదయం 5 గంటలకే షోలు పెట్టుకొని, టికెట్లు అమ్మేయమని, బయ్యర్లకు 'సైరా' టీం నుండి సందేశాలు వెళ్లినట్లు సమాచారం. అయితే అలా ముందే అమ్మేస్తే ఆ తరువాత పర్మిషన్లు రాకపోతే సమస్య అవుతుందని బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు కానీ మెగా కాంపౌండ్ మాత్రం ధీమాగా ఉంది.

ఓ పక్క జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ద్వారా, మరోపక్క వైకాపాలోని కాపు నాయకుల ద్వారా, ఇంకోపక్క రెడ్డి సామాజిక వర్గం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇలా చేస్తూనే జిల్లాల వారీగా, థియేటర్ల నుండి కలెక్టర్లకు అప్లికేషన్లు అందించి అక్కడ నుండి పర్మిషన్లు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఐదు గంటల కంటే ముందు షో వేయకూడదని, 5 గంటలకు మాత్రం షో పడితే చాలని 'సైరా' టీం భావిస్తోంది. ఐదు గంటల షో కోసమైనా.. పర్మిషన్లు రావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. పర్మిషన్లు రాకపోతే గనుక ఇక ఎర్లీ మార్నింగ్ షోకు రద్దవ్వడం ఖాయం!

 

click me!