మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేసింది. అయితే ఆమె రీసెంట్ గా అమెరికాకు వెళ్లిపోయింది. కరోనా కు భయపడి అక్కడైతే సేఫ్ అని వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.
పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈమె టాలీవుడ్ తెరపై కూడా స్థానం సంపాదించింది సన్నిలియోన్. మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేసింది. అయితే ఆమె రీసెంట్ గా అమెరికాకు వెళ్లిపోయింది. కరోనా కు భయపడి అక్కడైతే సేఫ్ అని వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.
ఇండియాలో కన్నా అమెరికాలోనే కరోనా తీవ్రత ఎక్కువ. కానీ చిత్రంగా సన్నీ లియోన్ అక్కడికే వెళ్లింది. అమెరికా పౌరసత్వం ఉన్న సన్నీ లియోన్ ఆ దేశం ప్రొవైడ్ చేసిన ప్రత్యేక విమానంలో లాస్ ఏంజెల్స్ కి వెళ్ళిపోయింది. అక్కడ క్వరంటైన్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తునట్లు చెప్పింది. మరో ఆరు నెలల నుంచి ఏడాది పాటు అక్కడే ఉండబోతున్నట్లు సమాచారం. ఇండియాకి ఇప్పట్లో రానని,కరోనా భయం పూర్తిగా పోయేంతవరకు అక్కడే ఉంటానంటోంది. అయితే సన్నీ లియోన్ కి ఇప్పుడు ఇండియాలో అంత ఇంపార్టెంట్ పనులు కూడా ఏమి లేవు. ఆఫర్స్ కూడా లేవు. ఎలాగో బాలీవుడ్ షూటింగ్ లు కూడా వచ్చే యేడు దాకా జరగవు. అలాంటప్పుడు ఇక్కడ ఉండి చేసేదేముందని చెక్కేసిందంటున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లోని తన ఇంట్లో ఉంటూ ఇన్ స్టాగ్రామ్ వీడియోస్, ఫొటోస్, ఆల్బమ్స్ తో బిజిగా ఉంటోంది.
ఇదిలా ఉంటే ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లలేని క్లిష్ట పరిస్థితుల్లో సన్ని లియోన్ తన భర్త డేనియర్ వెబర్, పిల్లలు నిషా, నోవా, అషర్లతో కలిసి అమెరికాకు వెళ్లటం మాత్రం అంతటా హాట్ టాపిక్ గా మారింది. దానికి సన్నిలియోన్ మాత్రం మీ జీవితంలో పిల్లలు ఉన్నపుడు మీ ఆలోచనలు వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఒక నెల క్రితం వరకు ముంబైలో ఉన్న సన్నిలియోన్ యూఎస్కు ఎలా వెళ్లిందో తెలియక అందరు షాక్ అవుతున్నారు. ప్రభుత్వం కన్నుగప్పి ఆమె ఎలా దేశం విడిచి వెళ్లిందో తెలియదంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరు ఒకరు సహకరించకపోతే.. సన్ని లియోన్ దేశం విడిచి వెళ్లడం అంత ఈజీ కాదంటున్నారు చాలా మంది నెటిజన్స్.