ధోనికి మద్దతుగా సుధీర్ బాబు!

By AN TeluguFirst Published Jun 7, 2019, 3:28 PM IST
Highlights

ప్రస్తుతం ఎక్కడ చూసినా వరల్డ్ కప్ హాడావిడే నడుస్తోంది. ఇందులో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో ఆడి గెలిచింది. 

ప్రస్తుతం ఎక్కడ చూసినా వరల్డ్ కప్ హాడావిడే నడుస్తోంది. ఇందులో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో ఆడి గెలిచింది. ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ ధరించిన హ్యాండ్ గ్లోవ్స్ పై ఇండియన్ ఆర్మీకి చెందిన 'బలిదాన్' చిహ్నం ఉంది.

ఆర్మీపై తనకున్న గౌరవంతో తన గ్లోవ్స్ పై ఈ చిహ్నాన్ని ముద్రించుకున్నారు. అయితే ధోనీ ఆ గ్లోవ్స్ పై ఆ ముద్రని తొలగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సూచించింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ చేసిన సూచనపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ధోనీ గ్లోవ్స్ పై ఆ చిహ్నం ఉంటే ఏమైందంటూ తిట్టిపోస్తున్నారు.

ఈ విషయంలో  ధోనీకి అండగా నిలుస్తున్నారు. ఈ లిస్ట్ లో హీరో సుధీర్ బాబు కూడా చేరారు. ఐసీసీ రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలని అన్నారు. ఈ విషయంలో తన మద్దతు ధోనీకేనని స్పష్టం చేశారు. ఐసీసీ సూచనకు తాను వ్యతిరేకం కాదని, కానీ గ్రౌండ్ లో ఆటగాళ్లు మతపరమైన కార్యకలాపాలు చేయడం తను చూశానని అన్నారు. పొలిటికల్ సింబల్ అయిన మూడు సింహాలను ఇంగ్లండ్ జట్టు ధరిస్తుందని, వాళ్లకు కూడా ఐసీసీ ఉన్నట్లయితే  రూల్స్ పేరుతో వాటన్నింటినీ ఆపేయాలని అన్నారు.

ఏదేమైనా.. తాను ధోనీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, పరేష్ రావల్ వంటి వారు ధోనికి మద్దతు తెలిపారు. బీసీసీఐ కూడా ధోనీకే సపోర్ట్ చేసింది. బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్.. ధోనీ గ్లోవ్స్ ని  అనుమతించాలని ఐసీసీని కోరారు.   

click me!