విధ్వంసం సృష్టిస్తున్న ప్రభాస్.. సాహో పోస్టర్ మైండ్ బ్లోయింగ్!

By tirumala ANFirst Published Jun 12, 2019, 6:24 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఇండియన్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఇండియన్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తోంది. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేస్తోంది. జూన్ 13 గురువారం రోజు సాహో టీజర్ రిలీజ్ చేస్తున్నారు. గురువారం ఉదయం 11:23 గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. 

ఇప్పటి వరకు సాహో చిత్రం నుంచి చాలా పోస్టర్స్ వచ్చాయి. తాజాగా విడుదలైన పోస్టర్ మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. బైక్ పై ప్రభాస్ విధ్వంసం సృష్టిస్తూ కనిపిస్తున్నాడు. ఈ ఒక్క పోస్టర్ తో సాహో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రభాస్ బైక్ పై దూసుకొస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో కారులు పేలుతూ గాల్లోకి ఎగిరిపడుతున్న ఈ దృశ్యం అద్భుతంగా ఉంది. 

 

Get ready for the glimpse of India's biggest action entertainer! 👊🖤❤️ out at 11:23 AM tomorrow. pic.twitter.com/8qAZ3q1GTs

— Shraddha (@ShraddhaKapoor)
click me!