
రామ్చరణ్ ఐటెమ్ భామ లీసా హెడెన్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. మూడోసారి తల్లి కాబోతున్న వెల్లడించింది. ఆమెకి ఇప్పటికే కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డకి జన్మనిచ్చేందుకు రెడీ అవుతుంది. `ఈ జూన్లో నెంబర్3 రాబోతున్నారు` అని పేర్కొంది లీసా. ఈ మేరకు ఆమె ఇన్స్టాలో ఓ వీడియోని పంచుకుంది. తన కుమారుడితో ఉన్న ఆ వీడియో ఆకట్టుకుంటుంది.
ఇందులో లీసా చెబుతూ, `ఇన్నాళ్లు బద్దకం కారణంగా ఈ ప్రకటన కాస్త ఆలస్యం అయ్యింది. ఇప్పుడు నేను మీతో చాట్ చేయడానికి ఓ కారణం ఉంది` అంటూ వీడియోని పంచుకుంది. ఇందులో తాను ప్రెగ్నెన్సీ అనే విషయం చెబుతున్న లీసా వద్దకి కుమారుడు జాక్ వచ్చాడు. దీంతో ఆమె `జాకీ, అమ్మ పొట్టలో ఎవరున్నారో వీళ్లకి చెప్తావా` అని అడగ్గా, `సిస్టర్` అని సమాధానం ఇచ్చాడు జాక్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు రెండు లక్షలకుపైగా వ్యూస్ని పొందింది.
చెన్నైకి చెందిన ఈ అమ్మడు బాలీవుడ్లో సెటిల్ అయ్యింది. మోడల్గా కెరీర్ని ప్రారంభించింది. 2010లో `హైసా` చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. `రాస్కెల్స్`, `క్వీన్`, `ది షావ్కీన్స్`, `సాంతా బంతా ప్రై. లిమిటెడ్`, `హౌజ్ఫుల్3`, `హే దిల్ హై ముష్కిల్` చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు రామ్చరణ్ హీరోగా రూపొందిన `రచ్చ` చిత్రంలో టైటిల్ సాంగ్లో ఐటెమ్ గర్ల్ గా ఓ ఊపు ఊపింది. దీంతోపాటు పలు టీవీ షోస్ చేస్తుందీ అమ్మడు. హెడెన్ 2016లో డినో లల్వానీని వివాహం చేసుకుంది. 2017లో వీరికి కుమారు జాక్ జన్మించారు. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో లియో కూతురు జన్మించగా, ఇప్పుడు మూడోసారి ప్రెగ్నెంట్ అయ్యింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లీసా హెడెన్... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తున్నారు. తల్లి కావడంలోని మాధుర్యాన్ని వివరిస్తూ గతంలో అనేక ఫొటోలు షేర్ చేశారు.