రకుల్ కి మరో బాలీవుడ్ ఆఫర్!

By Udayavani DhuliFirst Published Nov 14, 2018, 2:30 PM IST
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం బాధాకరం. ఇప్పటికే హీరోలందరితో నటించేయడం వలన దర్శకులు రకుల్ కి బదులు మరో కొత్త కాంబినేషన్ కోసం చూస్తున్నారు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం బాధాకరం. ఇప్పటికే హీరోలందరితో నటించేయడం వలన దర్శకులు రకుల్ కి బదులు మరో కొత్త కాంబినేషన్ కోసం చూస్తున్నారు.

ఈ క్రమంలో కొత్త హీరోయిన్లు అవకాశాలు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కార్తి, సూర్యలతో కలిసి సినిమాలు చేస్తోంది. అలానే హిందీలో అజయ్ దేవగన్ సరసన 'దేదే ప్యార్ దే' అనే సినిమాలో నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బాలీవుడ్ సినిమాలోలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. గతంలో రకుల్.. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'అయ్యారీ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ కెరీర్ కి ఈ సినిమా ఏ విధంగానూ ప్లస్ కాలేకపోయింది.

అయితే సిద్ధార్థ్, రకుల్ పెయిర్ దర్శకుడు మిలప్ ఝవేరికి నచ్చడంతో అతడు రూపొందిస్తోన్న 'మర్ జవాన్' అనే సినిమాలో రకుల్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా మరోసారి సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ల జంటను చూడొచ్చు. ఈ సినిమా అమ్మడుకి ఎలా సక్సెస్ అందిస్తుందో చూడాలి!

click me!