నువ్ లంగా పనులు చేస్తే వర్మ ఎందుకు వదులుతాడు.. పోసాని కామెంట్స్!

By Udaya DFirst Published Mar 9, 2019, 8:10 AM IST
Highlights

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ముందుగా వర్మతో తనకున్న బంధం గురించి చెప్పిన పోసాని సినిమా గురించి మాట్లాడుతూ చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్స్ చేసారు.

ఈ సినిమా బయటకి రానివ్వకుండా పలానా పార్టీ వాళ్లు సెన్సార్ దగ్గర ఆపేస్తారనే మాటలు తాను వింటున్నానని చెప్పిన పోసాని ఇలాంటి వెధవ వేషాలు వేయడం ఎందుకు..? నువ్ నిజాయితీగా ఉండొచ్చు కదా.. అంటూ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 

''ఎవడైతే వెధవ వేషాలు వేస్తాడో వాడికే కష్టాలు, కన్నీళ్లు, కోపాలు వస్తాయి. అవినీతి పనులు చేసిన వాడు, వెన్నుపోటు పొడిచిన వాడే బాధ పడుతుంటాడు'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. 

''నువ్ ప్రజాస్వామ్యంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి, రాజకీయాల్లో ఉండి లంగాపనులు చేస్తుంటే రాము(రాం గోపాల్ వర్మ) ఎందుకు విడిచిపెడతాడు'' అంటూ పోసాని పరోక్షంగా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

click me!