ఆడియో క్లిప్పింగ్స్ లీక్... పోలీస్ లను అశ్రయించిన పూనమ్ కౌర్

By Prashanth MFirst Published Apr 18, 2019, 10:01 AM IST
Highlights

పూనమ్ కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లక్కారు.  తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి పూనమ్‌కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్  లో పిర్యాదు చేసారు. తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలను యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూనమ్ కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లక్కారు.  తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి పూనమ్‌కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్  లో పిర్యాదు చేసారు. తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలను యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ పిర్యాదులో ముఖ్యంగా ..ఏడాదిన్నర క్రితం తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు.. తన ఫ్రెండ్‌తో మాట్లాడిన కొన్ని మాటలను ఇటీవలి కాలంలో కొంతమంది బయటపెట్టారని.. వాటిని తొలగించాలని ఆమె ఫిర్యాదు చేశారు. కోటి, బన్నీ అనే ఇద్దరు వ్యక్తులపై ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు సంబంధించి మొత్తం 20-25 ఆడియో క్లిప్పింగ్స్‌‌ ఆయా వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెల్స్ ద్వారా బయటకొచ్చాయని.. వాటిని తొలగించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

ఇక పూనమ్ కౌర్ కంప్లైంట్ పై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆమె ఏ రాజకీయ పార్టీపై గానీ, నేతపై గానీ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కేవలం తనకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ను కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేశారని.. వాటిని తొలగించాల్సిందిగా కోరారని చెప్పారు. పూనమ్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

అలాగే అడిషనల్ డీసీపీ రఘువీర్‌ను కలిసిన పూనమ్ తన కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ, పూనమ్ 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రఘువీర్ తెలిపారు.

click me!