‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ అయితే ఇప్పటికి మర్చిపోలేరు. ఆది సినిమాలోని ఈ డైలాగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జూ.ఎన్టీఆర్ కథానాయకుడిగా.. వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బ్లాక్బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోల చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆయా హీరోల స్పెషల్ డేస్ను పురస్కరించుకున్న భారీ విజయం సొంతం చేసుకున్న ఆనాటి ఎవర్గ్రీన్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి, పవన్ కల్యాణ్ జాల్సా, రీసెంట్గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీరిలీజ్ చేయగా వాటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దూకారు.
‘ఆది’ విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర టీమ్ సన్నాహాలు చేస్తోంది. రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోన్న ఈ తరుణంలో ఇప్పటికే పోకిరి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు మరోసారి ట్రెండ్ సృష్టించాయి. ఈ తరుణంలో ఆది సినిమాను కూడా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాత సురేశ్ తెలిపారు. ’’గతేడాది కేవలం ఫ్యాన్స్ షో మాత్రమే వేశాం. కాకపోతే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీగా విడుదల చేయాలనుకుంటున్నాం. ‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్కు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని సురేశ్ వివరించారు.
తారక్ కెరీర్ల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం, ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘ఆది’. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్. ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ అయితే ఇప్పటికి మర్చిపోలేరు. ఆది సినిమాలోని ఈ డైలాగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జూ.ఎన్టీఆర్ కథానాయకుడిగా.. వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తొడ కొట్టరా చిన్నా.. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ అప్పట్లో ఓ ఊపు ఊపేశాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 22న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్లో ఈ సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని అనుకుంటున్నారు. బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేశ్ నవంబర్ 3వ వారంలో ఆది రీరిలీజ్ ఉండోచ్చని చెప్పారు. ఇక ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.