మనోజ్కు అభినందనలు చెబుతున్నారు. సీతాఫల్ మండీలో జరిగిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో వారిద్దరూ కలిసి పూజలు చేస్తూ తొలిసారిగా మీడియా ముందుకి వచ్చారు.
గత కొద్ది కాలంగా సాగుతున్న ప్రచారం నిజం అవుతోంది. మంచు మనోజ్ - భూమా మౌనక ల విషయం అఫీషయల్ గా ప్రకటించారు మనోజ్.ఈ నేపథ్యంలో బుధవారం మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. లైఫ్లో నెక్ట్స్ ఫేజ్లోకి అడుగుపెట్టబోతున్నానంటూ మనోజ్ ట్వీట్ చేశాడు చాలా రోజులుగా నా మనసులో దాచుకుంటూ వస్తోన్న ఓ స్పెషల్ న్యూస్ను జనవరి 20న అందరితో పంచుకోనున్నట్లు ఈ ట్వీట్లో పేర్కొన్నాడు. అతడి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండో పెళ్లిని ఉద్దేశించే మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు చెబుతున్నారు.
It’s been a while, i’ve been holding this special news close to my heart ❤️
Excited to enter into the next phase of my life.. :)
Announcing on 20th Jan 2023 🤗
Need all your blessing as always :))) pic.twitter.com/bKRnwKT0oc
అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి వివాహ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. రీసెంట్ గా మంచు మనోజ్ కడపలో ఉన్న పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొత్త సినిమాల గురించి ప్రస్తావించారు. మంచు మనోజ్ - భూమా మౌనిక వివాహం చేసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మనోజ్ చెప్పినట్లుగా ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖారారైనట్లు సమాచారం.
జనవరి 20న అదే పెళ్లి న్యూస్ను అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నెటిజన్లు కూడా మనోజ్ ట్వీట్కు స్పందిస్తూ అతడు పెళ్లి చేసుకోనున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. మనోజ్కు అభినందనలు చెబుతున్నారు. సీతాఫల్ మండీలో జరిగిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో వారిద్దరూ కలిసి పూజలు చేస్తూ తొలిసారిగా మీడియా ముందుకి వచ్చారు. త్వరలోనే వారిరువురూ పెళ్ళిచేసుకోబోతున్నారు. కనుక వారిద్దరి జీవితాలు మళ్ళీ గాడినపడుతున్నట్లే భావించవచ్చు.
ఫిబ్రవరి 2, 2023 లో వీరిద్దరి వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్- మౌనిక కు ఇది రెండో వివాహం. ఇద్దరూ వ్యక్తిగత కారణాలతో తొలి వివాహ బంధానికి దూరం అయ్యారు. కొంత కాలంగా మంచు మనోజ్ - మౌనిక చెన్నైలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న వీరిద్దరూ వివాహానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక మంచు కుటుంబంలో సినిమాలు పరంగా గత కొద్ది కాలంగా అందరూ ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. మంచు మోహన్ బాబు చివరిగా తీసి నటించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అవడమే కాక ప్రేక్షకులు లేక థియేటర్లలో నుంచి సినిమాని తీసేయవలసి వచ్చింది. ఆయన రెండో కుమారుడు మంచు విష్ణు ‘మా’ ఎన్నికలలో గెలిచి మా అధ్యక్షుడైనప్పటికీ మాలో ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నాడు. రీసెంట్ గా అతను నటించిన జిన్నా అట్టర్ ఫ్లాప్ అవడంతో అతను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.