
`రాజావారు రాణిగారు`, `ఎస్ఆర్ కళ్యాణమండపం` చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. `ఎస్ఆర్కళ్యాణమండపం`లో అద్భుతమైన నటనతో నటుడిగా తన స్పెషాలిటీని చాటుకోవడంతోపాటు ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇప్పుడు మూడో సినిమాతోనే ప్రయోగాలకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `సెబాస్టియన్ PC 524` చిత్రంలో ఆయన రే చీకటి బాధపడుతున్న పాత్రని పోషిస్తున్నారు. నమ్రతా దారేకర్ , కోమలి ప్రసాద్, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై ప్రమోద్-రాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తూ, రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్ బ్లైండ్నెస్ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ "సెబాస్టియన్ PC 524` చిత్రానికి సంబంధించిన మీడియా ఇంటరాక్షన్ గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ``రాజావారు రాణిగారు` అయిపోయిన తర్వాత బాలాజీ "యస్ ఆర్. కళ్యాణమండపం" షూట్ లో కలవడం జరిగింది. సెబా అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని ఈ కథను 15 నిమిషాలు వినగానే నచ్చి ఈ కథ చేయడానికి ఒప్పుకున్నాను.
`సెబాస్టియన్ అనే క్యారెక్టర్ చాలామందికి గుర్తుండిపోతుంది. `చంటి` సినిమాలో బ్రహ్మానందం గారు 15 నిమిషాలు రేచీకటి క్యారెక్టర్ చేస్తేనే అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. అలాంటిది ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఈ క్యారెక్టర్ ను చాలెంజ్ గా తీసుకుని చేస్తున్నాను. సెబాస్టియన్ సినిమా ప్రేక్షకులను 100% ఎంటర్టైన్ చేస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇంత తొందరగా దొరకడం నా అదృష్టం. సెబా క్యారెక్టర్ నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మదనపల్లిని కొత్తగా చూయించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాగే మున్ముందు పాన్ ఇండియా లెవల్లోనూ చేయాలనే ప్లాన్ కూడా ఉంది` అని తెలిపారు.
ఈ నెల(ఫిబ్రవరి) 25న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజు పవన్ నటిస్తున్న `భీమ్లా నాయక్` విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన సినిమాతోనే పోటీ పడటం గురించి స్పందిస్తూ, తన సినిమా కంటే ముందు పవన్ సినిమాని ఫస్ట్ షోకి చూస్తానని తెలిపారు కిరణ్. అంతేకాదు నిజంగానే బాస్(పవన్) ఫిబ్రవరి 25న వస్తే.. మా సినిమాని వాయిదా వేయడం గురించి ఆలోచిస్తామని తెలిపారు.
చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ, `సెబాస్టియన్" అను కానిస్టేబుల్ ను తనకున్న నైట్ బ్లైండ్నెస్ ద్వారా తను ఎం ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథను చెప్పిన వెంటనే కథ బాగుందని ఈ సినిమా చేద్దామన్నాడు కిరణ్. తెలుగులో ఓ హీరో ఇలాంటి బ్లైండ్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. మదనపల్లె రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేయడం నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూస్తున్న మీకు కిరణ్ కనిపించడు సెబాస్టియన్ కనిపించేలా చాలా అద్భుతమైన నటన చేశాడు. ఈ సినిమా చూసి బయటికి వచ్చిన వారందరికీ సెబాస్టియన్ క్యారెక్టర్ మీతో కొద్ది రోజులు ఉండిపోతుంది.
ఇందులో ఉన్న.ప్రతి క్యారెక్టర్ కు డార్క్ షెడ్ ఉంటుంది. ఈ కథ రాసుకున్నప్పుడే జిబ్రాన్ మ్యూజిక్ ఇమేజింగ్ చేసుకును కథ రాసుకోవడం జరిగింది.ఇందులోని ఆర్ట్ వర్క్ రియలిస్టిక్ గా ఉంటుంది.నిర్మాత లు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు, కిరణ్ సొంత బ్రదర్ లా నాకు సపోర్ట్ గా నిలిచాడు.కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎమోషన్,థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదల అవుతుంది` అన్నారు.
నటీనటులు
కిరణ్ అబ్బవరం, నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి
నిర్మాణ సంస్థ: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్,
బ్యానర్ : జ్యోవిత సినిమాస్
నిర్మాతలు: ప్రమోద్, రాజు,
సహ నిర్మాత: సిద్దారెడ్డి బి,
కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
సంగీతం: జిబ్రాన్,
డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ,
పబ్లిసిటీ & మార్కెటింగ్: చవన్ ప్రసాద్,
డీఐ: సురేష్ రవి,
సౌండ్: సింక్ సినిమాస్ సచిన్ సుధాకరన్,
ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి,
కళ: కిరణ్ మామిడి,
కూర్పు: విప్లవ్ న్యసదాం,
పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి
(బియాండ్ మీడియా),