#Rashmika:రష్మిక బ్యాన్‌ ... డైరక్టర్ కామెంట్స్ వైరల్‌

By Surya PrakashFirst Published Dec 5, 2022, 10:18 AM IST
Highlights

ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఈ విషయాన్ని నేను సపోర్ట్‌ చేయను’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 


గత కొన్ని రోజులుగా కన్నడ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్ ‘రష్మిక మందన’ను బ్యాన్ చేశామంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ గొడవ మొదలయింది. ఆ ఇంటర్వ్యూలో తనకి మొదటిగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్ట పడలేదు.దీంతో కన్నడిగులు కోపానికి గురైంది ఈ భామ. అయితే ఆమెను విమర్శించేవాళ్లు ఎంతమంది ఉన్నారో అంతకు రెట్టింపు సపోర్ట్ చేసేవాళ్లు ఇండస్ట్రీలో కనపడుతున్నారు. 
 
ఇక రష్మికపై బ్యాన్‌ విధిస్తే.. పరిశ్రమకే నష్టమని దర్శకుడు నాగశేఖర్‌ అన్నారు. తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రష్మిక వివాదంపై స్పందించారు. ‘‘ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. ‘సంజు వెడ్స్‌ గీత’ చిత్రాన్ని నేను తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లు కెరీర్‌లో పెద్ద స్టార్స్‌ అయ్యారు. నా సినిమా తర్వాత వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుంటారా? లేదా? అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. నేను దాన్ని పట్టించుకోను. నా తదుపరి సినిమాపైనే ఫోకస్‌ పెడతా. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం ఎక్కడో ఒకచోట బాధకు లోనవుతాం’’ అని అన్నారు.

రష్మికపై కన్నడ పరిశ్రమ బ్యాన్‌ విధించనుందంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘దాని గురించి నాకు తెలియదు. ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఈ విషయాన్ని నేను సపోర్ట్‌ చేయను’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఎన్నోసార్లు వాయిదాలు తరువాత, ఈ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమా కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు రీమేక్ గా వస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో విలక్షణ నటుడు సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి తనయుడు కాళభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

click me!