సుశాంత్‌ భౌతిక కాయానికి శవపరీక్ష నిర్వహించలేదా?

Published : Aug 12, 2020, 04:09 PM IST
సుశాంత్‌ భౌతిక కాయానికి శవపరీక్ష నిర్వహించలేదా?

సారాంశం

సుశాంత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబయి పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే ఉరేసుకుంటే కళ్ళు పూర్తిగా తెరిచి ఉండాలి. నాలుక బయటకు రాలేదు. దీంతో అసలు భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారా? అనే అనుమానాలను వ్యక్త పరిచారు. 

బాలీవుడ్‌  నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు అనేక మలుపులతో సాగుతున్న విషయం తెలిసిందే. ఇంతకి సుశాంత్‌ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ఎవరైనా హత్య చేశారా? అన్నది పెద్ద సస్పెన్స్ నెలకొంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా ఆరోపిస్తున్నారు. దీనితో ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్ళింది. సీబీఐ ఎలాంటి నిజాలను వెల్లడిస్తుందనేది ఆసక్తి నెలకొంది.
 
అయినప్పటికీ సుశాంత్‌ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు సుశాంత్‌ కుటుంబ సభ్యులు కూడా పలు అనుమానాలను సీబీఐ ముందు, బీహార్‌ పోలీసుల ముందు, ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముందు ఉంచారు. శవపరీక్ష విషయంలో పెద్ద డ్రామా జరిగిందని ఆరోపిస్తున్నారు. 

సుశాంత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబయి పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే ఉరేసుకుంటే కళ్ళు పూర్తిగా తెరిచి ఉండాలి. నాలుక బయటకు రాలేదు. తల వాచినట్టు లేదు. సాధారణంగా ఉంది. దీంతో అసలు భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారా? అనే అనుమానాలను వ్యక్త పరిచారు. తలపై గాయం ఉన్నట్టుగా సుశాంత్‌ ఫోటోలు చూస్తే తెలుస్తుందన్నారు. 

అంతేకాదు శవపరీక్ష చేస్తే తలలో ఏవైనా ఎముకలు విరిగాయా అనే విషయం తెలుస్తుంది. పోస్ట్ మార్టం తర్వాత సుశాంత్‌ తలపై శవపరీక్షలకు సంబంధించిన కుట్లు కనిపించలేదు. అంటే అసలు పోస్ట్ మార్టం చేశారా? ఎందుకంటే ఫోటోల్లో తలని కుట్టినట్టుగా ఎక్కడా కనిపించడం లేదని  కుటుంబ  సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు సుశాంత్‌ది నిజంగా ఆత్మహత్యా? లేక హత్య జరిగిందా? అనేది మిస్టరీగా మారింది. మరి దీనిపై ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌, బీహార్‌ పోలీసులు, సీబీఐ, ముంబయి పోలీసులు ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తి నెలకొంది. 

ఇక జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని బంద్రాలోగల తన అపార్ట్ మెంట్‌లో ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. కానీ సుశాంత్‌ ఆత్మహత్య అనేక మలుపులు తిరుగుతుంది. ఆయన కంటే ఐదు రోజుల ముందు ఆయన మాజీ మేనేజేర్‌ దిశా సలియన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయంతెలిసిందే. ఆమె కేసు కూడా రోజుకో కొత్త మలుపు తిప్పుతూ అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ కేసుకి సంబంధించి సీబీఐ ఎలాంటి నిజాలను వెల్లడిస్తుందో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి