పాక్ ని రెచ్చగొట్టి భారత్ తప్పు చేసింది.. హీరోయిన్ కామెంట్స్!

Published : Feb 27, 2019, 02:42 PM ISTUpdated : Feb 27, 2019, 02:48 PM IST
పాక్ ని రెచ్చగొట్టి భారత్ తప్పు చేసింది.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300కి పైగా ఉగ్రవాదులు మరణించారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300కి పైగా ఉగ్రవాదులు మరణించారు.

అయితే భారత్ 'సర్జికల్ స్ట్రైక్స్'కి పాల్పడి తప్పు చేసిందని అంటోంది పాకిస్తాన్ హీరోయిన్ మహిరాఖాన్. షారుఖ్ ఖాన్ నటించిన 'రాయిస్' సినిమాలో హీరోయిన్ గా నటించింది మహిరా. 2017లో ఈ సినిమా విడుదలైంది.

తాజాగా ఈ మెరుపు దాడులపై స్పందించిన మహిరా.. పాక్ ని రెచ్చగొట్టి యుద్ధానికి కాలు దువ్వొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో 'పాక్ ని రెచ్చగొట్టి భారత్ తప్పు చేసింది. సర్జికల్ స్ట్రైక్ వంటి చర్యలతో యుద్ధానికి స్వాగతం పలికినట్టే. భారత్-పాక్ ల మధ్య సాధారణ పరిస్థితిలు రావాలి' అంటూ వెల్లడించింది.

పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనుమరాలు  ఫాతిమా భుట్టో పంపిన ట్వీట్ కి మహిరా ఈ విధంగా స్పందించింది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!