Bigg Boss NonStop Telugu Winner: చరిత్ర సృష్టించిన బిందు మాధవి.. బిగ్‌బాస్‌ తెలుగు విజేతగా తొలి మహిళ

Published : May 21, 2022, 11:07 PM ISTUpdated : May 21, 2022, 11:13 PM IST
Bigg Boss NonStop Telugu Winner:  చరిత్ర సృష్టించిన బిందు మాధవి.. బిగ్‌బాస్‌ తెలుగు విజేతగా తొలి మహిళ

సారాంశం

బిగ్‌బాస్‌ చరిత్రలో నటి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌(ఓటీటీ) తెలుగులో విజేతగా నిలిచింది. అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది.

బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో బిందుమాధవి(Bindu Madhavi) చరిత్ర సృష్టించింది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ తెలుగు విన్నర్‌గా (BiggBoss Non Stop Telugu) నిలిచింది. బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో ఓ లేడీ కంటెస్టెంట్‌ విన్నర్‌గా నిలవడం ఇదే ఫస్ట్ టైమ్‌. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ఆమె బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ట్రోఫీని అందుకుంది. శనివారం సాయంత్రం జరిగిన గ్రాండ్‌ ఫినాలో బిందు మాధవి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ తెలుగు విన్నర్‌గా నిలిచింది. విన్నింగ్‌ కింద ప్రైజ్‌ మనీ కింద రూ.50లక్షలు అందుకున్నారు బిందు మాధవి. 

ఈ గ్రాండ్‌ ఫినాలేలో అఖిల్‌ రన్నరప్‌గా నిలవగా, యాంకర్‌ శివ మూడో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌ తెలుగు 4`లోనూ అఖిల్‌ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అటు టీవీ బిగ్‌బాస్‌, ఇటు ఓటీటీలోనూ ఆయన రన్నరప్‌కే పరిమితమయ్యారు. ఎంతో ఓపికగా గేమ్‌ ఆడుతూ, హార్డ్ వర్కింగ్‌తో బిందు మాధవి బిగ్‌బాస్‌ ఓటీటీ తెలుగు విన్నర్‌గా నిలిచారని అభిమానులు ప్రశంసలు కురిపించడం విశేషం. ఇక ఇందులో నాల్గో స్థానంలో నిలిచిన అరియానా రూ.10 లక్షల ఆఫర్‌తో వైదొలిగడం విశేషం. ఐదో స్థానంలో మిత్ర ఎలిమినేట్‌ అయ్యారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boos Nonstop) పేరుతో తెలుగులో ఫస్ట్ టైం ఓటీటీ ఫార్మాట్ ప్రసారమైంది. రెగ్యులర్ షోకి భిన్నంగా 24*7 కంటెస్టెంట్స్ గేమ్ అందుబాటులో ఉంటుంది. వారాంతాల్లో స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక గత మూడు సీజన్స్ కి హోస్ట్ గా ఉన్న నాగార్జున (Nagarjuna) బిగ్ బాస్ నాన్ స్టాప్ హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్స్ మిక్స్ తో షో సిద్ధం చేశారు. పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ ని చాలెంజర్స్ గా విభజించారు. 

ఈ షోకి ప్రారంభం నుంచి మిక్స్డ్ స్పందన దక్కింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్, యాంకర్ శివ, మిత్ర, అనిల్ రాథోడ్, అఖిల్ సార్థక్ (Akhil Sarthak), బిందు మాధవి, అరియనా ఫైనల్ కి చేరారు. కాగా బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ గా ఉన్న అఖిల్ సార్థక్ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఆయన గేమ్ కూడా ఆకట్టుకుంటుంది. అఖిల్ కి హీరోయిన్ బిందు మాధవి (Bindhu Madhavi) నుండి గట్టిపోటీ ఎదురవుతుందని ముందు నుంచీ ఊహించారు, తాజాగా ఫైనల్‌లోనూ అదే జరిగింది. కానీ ఊహించని విధంగా బిందు మాధవిని ప్రకటించి హోస్ట్ నాగార్జున అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా