బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్. జోరుగా సాగుతున్న ఈసినిమా షూటింగ్ కు ప్రమాదం కారణం గా బ్రేక్ పడింది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేసిన సినిమా వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్. ఈసినిమాలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీమహారాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. కొల్హాపూర్లో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కు బ్రేక్ పడింది. సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా ఈమూవీ షూటింగ్ ఆగిపోయింది. అంతే కాదు ఈ ప్రమాదంలో ఒక యువకుడి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు యువకుడు లోయలో పడిపోవడంతో అంతా ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే... వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్ మూవీ షూటింగ్ కొల్హాపూర్లో జరుగుతుండగా.. ప్రమాదవశాత్తు వంద అడుగులు ఎత్తు నుంచి 19 సంవత్సరాల యువకుడు లోయలో పడిపోయాడు. దాంతో తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది.. కొల్హాపూర్లోని పన్హల్గడ్లో సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫొటోగ్రఫీ చేస్తున్న నగేశ్ ఖోబారే అనే యువకుడు కాలు జారడంతో నేరుగా లోతైన లోయలో పడిపోయాడు. ఈ ఘటన సెట్లో కలకలం సృష్టించింది.
ముందుగా అతన్నిదగ్గరలో ఉన్న కొల్హాపూర్ ఆసుపత్రికి తరలించారు. కాని పరిస్థితి విషమంగా ఉండడంతో.. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అయితే, ఇప్పటి వరకు పన్హాలా పోలీసులు గానీ, మూవీ టీమ్ కాని ఈ ప్రమాదంపై అఫీషియల్ గా ప్రకటన చేయలేదు. అధికారికంగా ప్రకటన వస్తే.. మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రమాదం కారణంగా షూటింగ్ ఎప్పటి వరకూ వాయిదా పడుతుందన్న విషయంలో కూడా క్లారిటీ లేదు.
ఇక శివాజీ మహారాజ్ కథతో.. మరాఠీ భాషలో తెరకెక్కుతుంది వేదాత్ మరాఠే వీర్ దౌడు సాత్ సినిమా. ఈ చిత్రానికి నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్ గత కొన్ని రోజులుగా కొల్హాపూర్లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో పాటుగా . జై దుధానే, ఉత్కర్ష్ షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ తర్దే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.