ప్రభాస్‌ లేకుండానే `ఆదిపురుష్‌` షూటింగ్‌.. `సలార్‌` స్టార్‌తో వాణీ కపూర్‌

By Aithagoni RajuFirst Published Jul 4, 2021, 7:46 AM IST
Highlights

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన `ఆదిపురుష్‌` చిత్ర షూటింగ్‌ తాజాగా శనివారం ప్రారంభమైంది. ముంబయిలో షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. మరోవైపు సలార్‌తో వాణి కపూర్‌ జోడీ కట్టబోతుంది.

ప్రభాస్‌ నటిస్తున్న భారీ చిత్రాల్లో ఒకటి `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం  వహిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన చిత్ర షూటింగ్‌ తాజాగా శనివారం ప్రారంభమైంది. ముంబయిలో షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఇంకా ఇందులో ప్రభాస్‌ పాల్గొనేందుకు కాస్త టైమ్‌ పడుతుందని సమాచారం. 

అయితే ప్రభాస్‌ హైదరాబాద్‌లో `రాధేశ్యామ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని సన్నివేశాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ `రాధేశ్యామ్‌` షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రభాస్‌ `ఆదిపురుష్‌` షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట. ఈ లోపు ప్రభాస్‌ లేని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఓం రౌత్‌ బృందం బిజీ అయ్యింది. త్రీడీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. దాదాపు 400కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లో కూడా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్‌లోకి తీసుకురాబోతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్‌తో `ఆహాకళ్యాణం` బ్యూటీ వాణీ కపూర్‌లో రొమాన్స్ చేయబోతుందట. `సలార్‌` చిత్రంలో ఆమెని కీలక పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది.

click me!