నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్

By narsimha lodeFirst Published Jul 2, 2019, 5:49 PM IST
Highlights

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి  సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను  సీజ్ చేయాలని సింగపూర్  హైకోర్టు  ఆదేశించింది. 

స్విట్జర్లాండ్: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి  సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను  సీజ్ చేయాలని సింగపూర్  హైకోర్టు  ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  మంగళవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది.

తమ వినతి మేరకు రూ.44.41 కోట్లు డిపాజిట్లు ఉన్న పెవిలియన్ పాయింట్ కార్పోరేషన్ కంపెనీ ఖాతాను సింగపూర్ కోర్టు నిలిపివేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఈ కంపెనీకి మయాంక్ మొహ్తా, పూర్వీ మోడీలు ఓనర్లు.  భారత బ్యాంకుల నుండి ఈ సొమ్మును అక్రమంగా తరలించారని ఈ ఖాతాలను నిలిపివేయాలని  ఈడీ అభ్యర్థించింది.

ఈ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొందని ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ, ఆయన సోదరి పూర్వి ఖాతాను  స్విస్ ప్రభుత్వం స్థంభింపజేసింది. ఇదే తరహాలో సింగపూర్ సర్కార్ కూడ నిర్ణయం తీసుకొంది.  ఈ ఏడాది మార్చిలో నీరవ్ మోడీని బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

click me!