కూతురికి సమస్యగా ఉందని ముకేశ్ అంబానీ ఏకంగా ఏం చేసాడో తెలుసా..?

By Ashok kumar SandraFirst Published Feb 28, 2024, 12:49 PM IST
Highlights

ధనవంతులు, వ్యాపారులు సామాన్యుల కష్టాలను అర్థం చేసుకోవాలంటే ఆ సమస్య వేడిని కూడా అనుభవించాల్సిందే. అంబానీ విషయంలోనూ అంతే. 

ఈరోజు నెట్‌వర్క్ అంటే జియో అనే స్థాయిలో జియో భారతదేశాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ముందుగా గ్రామస్థులు  ఫోన్ చేయాలంటే సిగ్నల్ దగ్గరే ఉండాలి. నెట్‌వర్క్ కోసం మాత్రమే ఇంటి పైన కాల్స్ చేయడానికి,  కాల్స్ కోసం వేచి ఉండేవారు. అయితే, జియో గ్రామాల్లోని ప్రతి గడపకు చేరుకుంది. ఇప్పుడు  ఊరి యువత కూడా యూట్యూబ్‌లో ఛానల్‌ ఓపెన్‌ చేసే పనికి మార్గం కనుక్కున్నారు. జియో నెట్‌వర్క్ లేకుండా, కోవిడ్ సమయంలో చాలా మంది ఇంటి నుండి వర్క్ చేయడం సమస్యగా ఉండేది. అయితే, జియో చాలా మంది జీవితాలను మార్చింది. రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ ఈ జియోని లాంచ్ చేయడానికి కారణం తన కూతురుకి కలిగిన నెట్‌వర్క్ సమస్యలే!

ధనవంతులు, వ్యాపారులు సామాన్యుల కష్టాలను అర్థం చేసుకోవాలంటే ఆ సమస్య వేడిని కూడా అనుభవించాల్సిందే. అంబానీ విషయంలోనూ అంతే. అవును, భారతదేశపు అత్యంత ధనవంతుడు అండ్  భారతదేశ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన టెలికాం దిగ్గజం జియో వెనుక ఉన్న ముఖం  ముఖేష్ అంబానీ, లండన్‌లో జరిగిన 2018 ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్‌నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్ సందర్భంగా తన ప్రసంగంలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

అతని కూతురు ఇషా 2011లో జియోను ప్రారంభించింది. ఇది తన ఆలోచననే  అని ముఖేష్ అంబానీ చెప్పారు. తన  కుమార్తె అప్పుడు యేల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అండ్   సెలవుల కోసం ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో నెట్‌వర్క్ చాల స్లోగా ఉండటం ఆమెకు నిరాశ కలిగించింది. ఇంట్లో ఉండగానే కొన్ని కోర్సులు పూర్తి చేయాలనుకున్న ఇషాకు ఇంటర్నెట్ సమస్య పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని ఆమె తన తండ్రికి చెప్పింది. 
 
తన కూతురి సమస్యను విన్న అంబానీ తన కూతురికి మాత్రమే కాకుండా లక్షలాది మంది భారతీయులకు సరసమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి జియోను ప్రారంభించారు. 

ఈ ప్రసంగంలో, ముఖేష్ తన పిల్లలు ఇషా, ఆకాష్ అసాధారణమైన సృజనాత్మకత, ప్రతిష్టాత్మక అండ్ ప్రపంచ స్థాయిలో సాధించాలనే ఆతృత ఉన్న తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. 
 

click me!