ఫిక్కీ నూతన ప్రెసిడెంట్‌గా ఉదయ్‌ శంకర్‌.. 2020-21 నూతన కార్యవర్గం ఎంపిక..

Ashok Kumar   | Asianet News
Published : Dec 15, 2020, 03:01 PM IST
ఫిక్కీ నూతన ప్రెసిడెంట్‌గా ఉదయ్‌ శంకర్‌.. 2020-21 నూతన కార్యవర్గం ఎంపిక..

సారాంశం

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన కార్యవర్గం ఎంపికైంది. ప్రస్తుతం ఉదయ్‌ శంకర్‌ ది వాల్ట్‌ డిస్నీ కంపెనీ, స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియాలకు ఏపీఏసీ అండ్‌ చైర్మన్‌గా ఉన్నారు. 

న్యూ ఢీల్లీ: మీడియా ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ 2020-2021 సంవత్సరానికి ఫిక్కీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు పరిశ్రమల సంఘం సోమవారం తెలిపింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన కార్యవర్గం ఎంపికైంది.

ప్రస్తుతం ఉదయ్‌ శంకర్‌ ది వాల్ట్‌ డిస్నీ కంపెనీ, స్టార్‌ అండ్‌ డిస్నీ ఇండియాలకు ఏపీఏసీ అండ్‌ చైర్మన్‌గా ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగితా రెడ్డి తరువాత ఆయన బాధ్యతలు స్వీకరించారు.

వాల్ట్ డిస్నీ కంపెనీ ఇటీవలే ఉదయ్ శంకర్ ఆసియా పసిఫిక్ వ్యాపార అధ్యక్షుడిగా, స్టార్ అండ్ డిస్నీ ఇండియా ఛైర్మన్ పదవి నుంచి 31 డిసెంబర్  2020 నుండి పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది.

also read చైనా ఉత్పత్తులు వాడకుండా భారతదేశపు మొట్టమొదటి బ్లాక్‌చెయిన్ స్మార్ట్‌ఫోన్.. డిసెంబర్ 22న లాంచ్.. ...

అంతేకాకుండా హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇండియన్‌ మెటల్స్‌ అండ్‌ ఫెర్రో అల్లోస్‌ ఎండీ సుభ్రకాంత్‌ పాండా నియమితులయ్యారు.

ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రకాంత్ పాండా వైస్ ప్రెసిడెంట్‌గా ఫిక్కీ నాయకత్వంలో చేరారని ఛాంబర్ పేర్కొంది. "నా ముందున్న డాక్టర్ సంగితా రెడ్డి గత సంవత్సరం కాలంగా చేసిన కృషికి నేను అభినందిస్తున్నాను" అని శంకర్ అన్నారు.

ప్రభుత్వానికి ఇన్పుట్లను అందించడంలో, వృద్ధి వేగాన్ని తిరిగి పొందటానికి,  జిడిపి 8-10 శాతం వృద్ధికి త్వరగా చేరుకోవడానికి ఫిక్కీ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Today Gold Price in Hyderabad: పతనం దిశగా బంగారం, వెండి..అయితే ఎప్పటివరకో తెలుసా?
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే పనిమనిషి జీతమే ఎక్కువ.. ఏడాదికి 4.8 లక్షల సంపాదన సామీ !