దేశంలో అత్యధికంగా టాక్స్ కడుతున్నదెవరో తెలుసా!

Published : Aug 21, 2024, 12:11 PM IST
దేశంలో అత్యధికంగా టాక్స్ కడుతున్నదెవరో తెలుసా!

సారాంశం

దేశంలో కంపెనీలు, వ్యక్తులు ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారో వివరాలు వెల్లడిస్తూ ఇటీవల కేంద్ర ఆదాయపు పన్ను శాఖ సమాచారం విడుదల చేసింది. వారిలో అత్యధికంగా టాక్స్‌ లు కడుతున్నది ఎవరో తెలుసా.. దేశంలోనే అత్యంత సంపన్నులు అంబానీ, అదానీలు ఏ నంబరులో ఉన్నారో తెలుసుకుందాం రండి..

దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేక రకాల పన్నుల కట్టాల్సి ఉంటుంది. అందులో ఆస్తి పన్ను, వస్తు పన్ను, జీఎస్టీ తదితర టాక్స్ లు కడుతుంటాం. వస్తువు తయారు చేసినా, కొన్నా, అమ్మినా.. టాక్స్‌ కట్టాలి మరి.. ఇలా సామాన్య ప్రజల కంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు అత్యధికంగా టాక్స్‌ లు కడుతుంటారు.  కేంద్ర ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం అత్యధికంగా పన్నులు కట్టే టాప్‌ 10 కంపెనీలు ఇవిగో. 

మొదటి స్థానంలో రిలయన్స్‌ గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ 
2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్నదెవరంటే.. మీరు ఊహించిందే.. అదే రిలయన్స్‌ గ్రూప్‌ ఇండస్ట్రీస్‌.. వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి చెందిన ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో టాటా గ్రూప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), టాటా స్టీల్ (టాటా స్టీల్) వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. అయితే దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలేవీ టాప్ 10లో చోటు దక్కించుకోలేదు.

టాప్‌ 10 కంపెనీలివే..
Reliance Industries Limited.
State Bank of India (SBI)
HDFC Bank Limited.
Tata Consultancy Services (TCS)
ICICI Bank.
Oil and Natural Gas Corporation (ONGC)
Tata Steel Limited.
Coal India Limited (CIL)
Infosys
axis bank

వ్యక్తుల్లో మహేంద్ర సింగ్‌ ధోనీ..
ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం.. భారత్‌లో అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ రూ.38 కోట్లు, అక్షయ్ కుమార్ రూ.29.5 కోట్ల పన్ను చెల్లించారు. 

ఎవరు ఎంత చెల్లించారో తెలుసా..
ఆయిల్ టు టెలికాం సహా అన్ని రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఆదాయం రూ.9,74,864 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 20,376 కోట్ల పన్ను చెల్లింపుతో మొదటి స్థానంలో నిలిచింది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదాయం 3,50,845 కోట్లు కాగా, భారత ప్రభుత్వానికి రూ.16,973 కోట్లు బకాయిపడింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 15,350 కోట్ల పన్ను చెల్లిస్తూ మూడో స్థానంలో ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.14,604 కోట్లు చెల్లించింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.11,973 కోట్లు చెల్లించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ ONGC రూ.10,273 కోట్ల పన్ను చెల్లించింది. టాటా స్టీల్ రూ.10,160 కోట్లు, కోల్ ఇండియా రూ.9,876 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.9,214 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.7,326 కోట్లు చెల్లించాయి. ఈ టాప్ 10లో అంబానీ కంపెనీలేమీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 
 

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు