GST Collection: మేలో కూడా రూ. 1.50 లక్షల కోట్లు దాటిన GST వసూళ్లు..మోదీ సర్కారుకు జీడీపీ తర్వాత మరో శుభవార్త

By Krishna AdithyaFirst Published Jun 1, 2023, 7:28 PM IST
Highlights

బుధవారం జిడిపి వృద్ధి గణాంకాల తర్వాత, నేడు వచ్చిన జిఎస్‌టి వసూళ్లు మరోసారి ఆర్థిక బలాన్ని సూచించాయి. మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది మే నెల గణాంకాలతో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. అయితే ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో దాదాపు 30 వేల కోట్లు తగ్గుదల నమోదైంది. 

మే 2023 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మే నెలలో జీఎస్టీ ద్వారా మోదీ ప్రభుత్వం రూ.1,57,090 లక్షల కోట్లు ఆర్జించింది. మే 2022 గణాంకాలను పరిశీలిస్తే, ఈ కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1,40,885 లక్షల కోట్లుగా ఉంది. అంటే జీఎస్టీ వసూళ్లలో ఏడాది కాలంలో 12 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు జీఎస్టీని గత నెలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. ఏప్రిల్ 2023 లో GST వసూళ్లు 1.87 లక్షల కోట్ల నమోదైంది. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది-

మే 2023 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. మే 2023లో, మొత్తం రూ. 1,57,090 లక్షల కోట్లలో, రూ. 28,411 కోట్లు CGSTగా సేకరించబడ్డాయి. ఏప్రిల్‌లో సీజీఎస్టీ రూ.38,400 కోట్లు. కాగా, మేలో ఎస్‌జీఎస్టీ రూ.35,800 కోట్లుగా ఉంది. గత నెలలో ఈ సంఖ్య రూ.47,400 కోట్లుగా ఉంది. పన్ను మినహాయింపు తర్వాత ఈ నెల కేంద్రం జీఎస్టీ రూ.63,780 కోట్లు. ఇక రాష్ట్ర జీఎస్టీ రూ.65,597 కోట్లు అవుతుంది.

👉 ₹1,57,090 crore gross revenue collected for May 2023; clocks 12% Year-on-Year growth

👉 Monthly revenues more than ₹1.4 lakh crore for 14 months in a row, with ₹1.5 lakh crore crossed for the 5th time since inception of

👉 Revenue from import of goods 12%… pic.twitter.com/7ghdLDW3jt

— Ministry of Finance (@FinMinIndia)

జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 12 శాతం పెరిగాయి

GST వసూళ్లు గురించి మాట్లాడుకుంటే, మే 2022 నుండి ఇప్పటి వరకు GST సేకరణలో 12 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు, నెలవారీ జీఎస్టీ రాబడి గురించి మాట్లాడుకుంటే, జీఎస్టీ వసూళ్లు వరుసగా 14వ నెలలో రూ.1.4 లక్షల కోట్లు దాటాయి. అదే సమయంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జీఎస్టీ రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇది ఐదోసారి.

మే నెల జీఎస్టీ వసూళ్లు లెక్కలు విడుదల చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ

తెలంగాణ జీఎస్టీ వసూళ్లు 13% వృద్దితో 4,507 కోట్లు ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు 11% వృద్దితో 3,373 కోట్లు వసూలు చేశాయి. pic.twitter.com/EW0feSgYUX

— Telugu Scribe (@TeluguScribe)
tags
click me!