పడిపోయిన బంగారం ధరలు.. రెండు వారాల గరిష్టనికి బ్రేక్.. నేడు 10గ్రా, పసిడి ధర..?

By S Ashok KumarFirst Published Dec 9, 2020, 12:47 PM IST
Highlights

కొద్ది రోజుల కన్సాలిడేషన్‌ తదుపరి మంగళవారం బంగారం, వెండి ధరలు రెండు వారాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించనున్న వార్తలతో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలకు దిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న వార్తల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడంతో బంగారు ధరలు నేడు భారత మార్కెట్లలో పడిపోయాయి. ఎం‌సి‌ఎక్స్ లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.6% పడిపోయి రూ.49815 చేరుకోగా, వెండి ధర కిలోకు 1.2% పడిపోయి రూ.64,404కు చేరుకుంది.

కొద్ది రోజుల కన్సాలిడేషన్‌ తదుపరి మంగళవారం బంగారం, వెండి ధరలు రెండు వారాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించనున్న వార్తలతో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలకు దిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఫైజర్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల డేటాను పరిశీలించిన యూఎస్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఎలాంటి లోపాలూ కనిపించలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంకానున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్లలో, కరోనా టీకా పరిణామాలను ప్రోత్సహించడంతో బంగారం ధరలు ఈ రోజు క్షీణించాయి. స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.3% పడిపోయి 1,865.46 డాలర్లకు చేరుకుంది.

also read 

ఇతర విలువైన లోహాలలో వెండి ఔన్స్‌ ధర  0.7% పడిపోయి 24.38 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.6% పెరిగి 1,028.17 డాలర్లకు, పల్లాడియం 0.1% పెరిగి 2,311.87 డాలర్లకు చేరుకుంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ మంగళవారం డెమొక్రాట్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసికి కొత్త ఎకనామిక్ రెస్క్యూ ప్యాకేజీని అందించినట్లు చెప్పారు.

ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 395 క్షీణించి రూ. 49,714 వద్ద ట్రేడవుతోంది.న్యూయార్క్‌ కామెక్స్‌లో వరుసగా రెండు రోజులపాటు బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.55 శాతం క్షీణించి 1,864 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.6 శాతం నష్టంతో 1,860 డాలర్లకు చేరింది. వెండి సైతం 1 శాతం వెనకడుగుతో ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది.
 
బ్రిటన్లో కోవిడ్ వ్యాక్సిన్ల రోల్ అవుట్ రిస్క్ ఆస్తుల పట్ల ఆశావాదాన్ని పెంచింది. కోవిడ్ ఇమ్యునైజేషన్ ప్రచారాన్ని ప్రారంభించి, ప్రజలకు ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించిన మొదటి దేశం బ్రిటన్.

"బంగారం గణనీయంగా కోలుకున్నప్పటికీ, పెట్టుబడిదారుల ఆసక్తిని పునరుద్ధరించడంలో ఇది విఫలమైంది. టీకా పురోగతి, ఇటిఎఫ్ ప్రవాహాలు కొనసాగడం పసిడి ధరపై ఒత్తిడి తెస్తుంది "అని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది.

click me!