ప్రయాణికులకు సూపర్ ఆఫర్; టిక్కెట్ ధరలపై భారీ డిస్కౌంట్.. కొద్దిరోజులు ఛాన్స్..

By Ashok kumar SandraFirst Published Feb 3, 2024, 9:59 AM IST
Highlights

ఇయర్ ఇండియా విమాన టిక్కెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ పేరు నమస్తే వరల్డ్ సేల్.
 

ఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ పేరు నమస్తే వరల్డ్ సేల్. ఈ ఆఫర్‌లో దేశీయ ఇంకా అంతర్జాతీయ విమాన టిక్కెట్లు కేవలం రూ.1,799తో అందుబాటులో ఉన్నాయి. 

  ఈ సేల్ 4 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఫిబ్రవరి 2  నుండి ఫిబ్రవరి 5 వరకు మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 

విమానయాన సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం,  దేశీయ విమానాలలో ఎకానమీ క్లాస్ టిక్కెట్లు రూ. 1,799 నుండి ప్రారంభమవుతాయి. కాగా, బిజినెస్ క్లాస్ ధర రూ.10,899 నుండి అదేవిధంగా అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ ధర రూ.10,899 నుండి ఉంటాయి. ఈ సేల్‌లో ఎకానమీ ఛార్జీలు రూ. 3,899 నుండి ప్రారంభమవుతాయి. ఎకానమీ క్లాస్ ఛార్జీ కూడా కొన్ని గమ్యస్థానాల్లో రూ.9,600గా ఉంటుంది.

సేల్  బెనిఫిట్స్ ఎలా పొందాలి
ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకోవడానికి వీలైనంత త్వరగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. అంటే ముందుగా వచ్చిన వారికే ముందుగా టిక్కెట్టు అనే విధానాన్ని కంపెనీ అవలంబించింది. కాబట్టి టిక్కెట్లు త్వరలో అమ్ముడయ్యే అవకాశం ఉంది. 

మీరు సేల్ బెనిఫిట్స్   పొందాలనుకుంటే, మీరు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ఇంకా యాప్ నుండి విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ అండ్  యాప్ ద్వారా విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా కస్టమర్‌లు సర్వీస్ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.

సేల్‌లో ఏ అంతర్జాతీయ గమ్యస్థానాలు చేర్చబడ్డాయి?

ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ప్రకారం, ఈ సేల్ కింద అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ ఇంకా దక్షిణాసియాకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ అండ్  ప్రీమియం ఎకానమీ క్లాసులకు కూడా ఎయిర్‌లైన్ ప్రత్యేక ఛార్జీలను ప్రవేశపెట్టింది.

click me!