మహాభారత కథ చాలా ఆసక్తికరమైనది. ఇందులో చాలా రహస్యమైన పాత్రలు కూడా ఉన్నాయి. వీరి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి 5 పాత్రల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. కౌరవ సైన్యంలో చివరి సైన్యాధిపతి. ఆయన అమరుడని నమ్ముతారు. మహాభారతంలోని రహస్య పాత్రలలో ఆయన ఒకరు. చాలా మంది ఆయన్ని చూసినట్లు చెబుతారు.
పాండవుల కులగురువు కృపాచార్యుడు. ఆయన కూడా ఇప్పటికీ బతికే ఉన్నారని నమ్ముతారు. ఆయన రుద్రావతారం అని చెప్తారు. యుద్ధం అయిపోయాక కృపాచార్యుడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు.
గాంధారికి దుర్యోధనుడితో సహా 100 మంది కుమారులు. వీరితో పాటు ధృతరాష్ట్రునికి యుయుత్సు అనే మరో కుమారుడు ఉన్నాడు. యుయుత్సు యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడాడు.
ఏకలవ్యుడి గురించి అందరికీ తెలుసు. కానీ అతను ఎలా చనిపోయాడో చాలా తక్కువ మందికి తెలుసు. ఏకలవ్యుడు జరాసంధ సైన్యంలో ప్రధాన యోధుడు. శ్రీకృష్ణుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు.
మహాభారతాన్ని మహర్షి వేదవ్యాసుడు రాశాడు. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారు. వేదవ్యాసుడు విష్ణువు అవతారం అని చెప్తారు. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమను ఆయన గౌరవార్థం నిర్వహిస్తారు.